|
|
Articles: My Thoughts | అబ్బూరి వారి చాటువులు - Site Administrator
| |
'చాటువు అంటే ప్రియమైన మాట అని అర్ధము. ఇంపైన, సరసమైన, రమ్యమైన కవిత్వం' అన్న మాట. తెనాలి రామలింగ కవి శ్రీనాధుడు చెప్పినవి ఎన్నో చాటువులు చదవటానికి ఎంతో ఆశక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే సామాజిక పరిస్థితులు, ఆచార వ్యహారాలు మొదలైన అనేక అంశాల పైన ఆయా కవుల ప్రతిస్పందనలు చాటువుల ద్వారానే తెలుస్తాయి. అలాటి అబ్బూరివారి చాటువులు కొన్ని ... ముందుగా విశ్వనాధ వారిపై. 'ఆయన పూర్వ వాసనల్ని విడచి, అభ్యుదయ పధంలో పయనించి ఉంటే విశ్వ విఖ్యాతులయ్యే వారు అంటూ చెప్పిన చాటువు '...
విశ్వనాధ వాణి విశ్వ కుతూహలి
ఇంపుగా పురోగ మింప లేక
పూర్వ వాసనలకు సర్వ మర్పించి
తెలుగు నాడు నందె నిలిచి పోయె' ... తర్వాత రాయప్రోలు వారి అమలిన శృంగరన్ని కీర్తిస్తూ...
'రాయప్రోలు కైత రమణీయమగు కూత
పిదప కవుల పాలి నుదుటి వ్రాత
తెలుగు తోట మీద దిద్దిన పైపూత
నరుల చేత పలుకు బడుల చేత...' ... ఇక దేవులపల్లిని మధుర కవితా స్రవంతిని గురించి మాట్లాడుతూ...
'కృష్ట్ణ శాస్త్రి కృతులు కీర్తనలా కావు
పదములనుట కసలే పనికిరావు.
నేటి చెవులకింపు నింపెడు రాతులతో
కూర్చినట్టి మధుర కూజితములు' ... అదేవిధము గా జంట కవులు గా ప్రసిద్ధి జెందిన పింగళి కాటూరి కవుల మీద
'కైత లోన మిన్న కాటూరి వెంకన్న
లక్ష్మి కాంతుడతడు సూక్ష్మ బుద్ధి.
ఒకరి కున్న కీర్తి ఒకరికి రాబోదు
జంట కవులటను ప్రసక్తి దప్ప' ... ఇందులో కాటూరి వారిని కవి గాను పింగళి వారిని విమర్శకుడి గాను పేర్కొనటం గమనార్హం... ఇక శ్రీ శ్రీ అంటే ఎంతో గౌరవమున్నా 'సిరిసిరిమువ్వ' శతకాన్ని కొద్దిగా ఆక్షేపించారట.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|