|
|
Articles: TP Features | `చిక్కిపోయిన' చిరు - Site Administrator
| |
నందమూరి తారక రామారావు 1982 మార్చిలో తెలుగుదేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి కోలాహలం రాష్ట్రంలో మరోమారు కనిపించింది. ఆ రోజుల్లో మీడియా ఇంత విస్తృతంగా లేని కారణంగా ఎన్టీ రామారావు కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగితే కానీ జన హృదయాల్లో స్థానం దక్కలేదు. కానీ, చిరుకి ఆ పాటి శ్రమ కూడా లేకుండా మీడియా కావలసినంత ప్రచారం చేసింది. చిరంజీవి పార్టీ పెట్టాలని భావించారో లేదో కానీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ మీడియా లోకం మాత్రం కోడై కూసింది. ఈ ప్రచారం తీవ్రత ఎంతగా ఉందంటే చిరంజీవి ఇక వెనుకంజ వేయలేని స్థితికి తెచ్చిందంటే అతిశయోక్తి కాదు.
ఈ క్రమంలో చిరంజీవి పార్టీ - రంగు, రుచి, వాసన చెప్పక ముందే చేగొండి హరిరామ జోగయ్య (కాంగ్రెస్), కోటగిరి విద్యాధరరావు (తెలుగుదేశం), డాక్టర్ మిత్రాలు - చిరంజీవి పార్టీ 'రాజ్యాన్ని' నెలకొల్పారు. చిరంజీవి, ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ల సమావేశాల్లో వచ్చిన జనం స్పందన చూస్తే కొత్త పార్టీ 'దెబ్బ'కు మిగిలిన రాజకీయ పక్షాలు 'చిత్తు' కాక తప్పదనిపించింది. చిరంజీవి పర్యటనలకు, సభలకు వచ్చిన జనసందోహాన్ని చూసిన రాజకీయపక్ష నేతల్లోని నేతలు ఎంతో వేగంగా ప్రజారాజ్యంలో చేరిపోయారు. తెలుగుదేశం నుంచి కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం, కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు తదితరులు, కాంగ్రెస్ నుంచి జోగయ్యతో పాటు బూరగడ్డ వేదవ్యాస్ వంటి వారు చేరారు. ఇతర పార్టీల్లో క్రియాశీలంగా లేని కేఎస్ ఆర్ మూర్తి, ఉపేంద్ర, యలమంచిలి శివాజీ వంటి సీనియర్లు పొలోమంటూ ప్రజారాజ్యంలో చేరడం ఆ పార్టీకి ఎంతగానో కలిసి వస్తుందని అందరూ ఊహించారు.
'అన్న' ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో 'అధికారం' కుంభస్థలాన్ని కొడితే అంతకన్నా తక్కువ కాలంలో అధికారం దక్కించుకోవాలనుకున్న మెగా స్టార్ చిరంజీవి ఆశలకు ప్రజలు గండి కొట్టారు. అధికారం దక్కకపోతే పార్టీని నిలపడం ఎంత కష్టమో ఇప్పుడు చిరంజీవికి తెలిసినంతగా ఎవరికీ తేలీదు. సామాజిక న్యాయం పేరిట రాజకీయ రంగప్రవేశం చేసిన చిరంజీవికి ఆ పార్టీలోని నేతలు ఒక్కకొక్కరుగా 'ఝలక్' ఇచ్చారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|