|
|
Articles: TP Features | అను'బంధాల' రక్ష! - Site Administrator
| |
రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భార్య - భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్సాంప్రదాయమే 'రాఖీ' విశిష్టత. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరు కానుకలు సమర్పించి, అందరూ కలసి చక్కని విందు ఆరగిస్తారు.
విదేశీయులు మన దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో మొగలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ లేకుండా పోయేది. వారి కబంధ హస్తాల్లో హిందూ జాతి నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణ రక్షణకై వీరులైన యోధులను గుర్తించి వారికి 'రక్షాబంధనం' చేసి వారు చూపే సోదర భావంతో రక్షణ పొందేవారు. ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు ఢిల్లీ పాదుషాకు రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్త భోజనం చేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి.
అలాంటి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అమితానందంతో జరుపుకుని మన చక్కని భారతీయ సంప్రదాయ విలువలను కాపాడుకుందాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|