|
|
Articles: TP Features | 'బ్రహ్మాండ' సంపన్నుడు - Site Administrator
| |
వీటిలో వివాద రహితంగా ఉన్న ఆస్తుల విలువ లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ వ్యాజ్యాలను సాగించడం, ఆస్తుల మదింపు వేసే క్రమంలో ఎనిమిది మంది ఎస్ డిసి స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారంటే ఆస్తుల విలువ ఎంత ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి శ్రీవారి ఆభరణాలు, ఆస్తుల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇటీవలే హైదరాబాద్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి చర స్థిరాస్తుల విలువెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చిత్తూరు జిల్లా కార్వేటి మండలం సమీపంలో 10 ఎకరాలకు పైబడిన భూములు ఉన్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, యాత్రికుల సముదాయం-2, రైల్వేస్టేషన్ ఎదుట నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణం, శ్రీదేవి కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, మహతి, సాహితి, వేల సంఖ్యలో వ్యాపార సముదాయాల గదులు, విద్యాసంస్థల్లో ఎస్ పి డబ్ల్యు, మహిళా విశ్వవిద్యాలయం, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్, ఓరియంటల్ కాలేజ్, బాలమందిర్, ఎస్ జిఎస్, రుయా ఆసుపత్రి సమీపం నుంచి ఇంజనీరింగ్ కళాశాల విస్తరించి ఉన్న 1500 ఎకరాల స్థలం, తదితర ఆస్తులు శ్రీవారివే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలలో కల్యాణ మండపాలు, సమాచార కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో 200 కల్యాణ మండపాలు, దేశం మొత్తం మీద 400 మండపాలు. ఢిల్లీ గోల్ మార్కెట్ సమీపంలో మూడు ఎకరాల స్థలం (ధ్యానమందిరం, సమాచార కేంద్రం), 10-హెలీ రోడ్ లో దక్షిణేశ్వర బిల్డింగ్, ఎస్వీ కాలేజ్. రిషికేశ్ లో రెండు ఎకరాల మామిడి తోట, నైనిటాల్ లో మూడు ఎకరాల మామిడి తోట ఉన్నాయి. తిరుత్తణి, తిరువణ్ణామలై, షిరిడీ తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలలో లెక్కకట్టలేని ఆస్తులు ఎన్నో ఉన్నాయి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|