|
|
Articles: TP Features | అందరికీ అన్నదాతే లోకువ! - Site Administrator
| |
మరోవైపు మార్కెట్ లో ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. టమోటాలకు ధర ఉంది కదా అని రైతులు వాటిని పండిస్తే టమోటా ధర కిలో 10 పైసలకు కూడా పోవడం లేదు. ఉల్లిపాయల ధరా అంతే. అటు రైతు - ఇటు వినియోగదారుల కంట్లో కన్నీరు తెప్పిస్తోంది. ఆహార భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో సాగుభూమిని పెంచాల్సిన ప్రభుత్వాలు పంట భూముల్ని రైతుల నుంచి లాక్కొని 'సెజ్' సామంత రాజ్యాలు నెలకొల్పుతున్నాయి. రైతులు కూలీలుగా మారుతున్నారు. తమ పిల్లలకు వారసత్వంగా కూలి బతుకుల్ని ఇస్తున్నారు.
రైతులపై వ్యాఖ్యానాల విషయానికి వస్తే మంత్రిగా పనిచేసిన సమయంలో జేసి దివాకర్ రెడ్డి ఇలాగే వ్యాఖ్యానించారు. రైతులు మద్యానికి బానిసలు అవుతున్నారని చెప్పారు. అంతకు ముందు మరో మంత్రి రఘువీరారెడ్డి కూడా వరిని సాగుచేస్తే తల్లి రొమ్ము గుద్ది నెత్తురు తాగినట్టేనని ఒక సందర్భంలో చెప్పారు. నిజమే! రైతుల్ని ఆదుకోలేదంటే కాంగ్రెస్ నేతలు తట్టుకోలేరు. ఎందుకంటే... తెలుగుదేశం హయాంలో ఐదు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసి మరీ అధికారంలోకి వచ్చారు. అలాగని రైతుల చావులు అక్కడితో ఆగలేదు. 2004 నుంచి 2009 వరకు కూడా ఐదు వేల మందికి పైగా రైతులు చనిపోయారని అంచనా. బహుశా ఇవి ఆత్మహత్యలు కావేమో వారి దృష్టిలో!
కాంగ్రెస్ కు చెందిన వారే కాదు కాంగ్రేసేతర పక్షాల నేతలు కూడా రైతులంటే లెక్కలేనితనంగా మాట్లాడారు. భారతీయ జనతాపార్టీకి చెందిన బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు 'రైతులు తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని' చులకనగా అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా, ఏడేళ్ళ వరుస కరవులతో ఆదుకునే దిక్కులేక రైతులు అధికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం లక్షన్నర రూపాయల కోసమే ఆత్మహత్యలు చేసుకున్నారని కొందరు తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|