|
|
Articles: TP Features | భాజపాను వీడని జిన్నా నీడ! - Site Administrator
| |
భారత్ తిరిగి వచ్చిన ఆయన స్వాతంత్ర్య సమరంలో పాల్గొనలేదు. ఇదే సమయంలో బ్రిటీష్ సామ్రాజ్య వాదులపై కాంగ్రెస్ తన పోరాటాన్ని ఆఖరి ఘట్టానికి తీసుకుపోయే దశలో ఉంది. ఇందుకు పాకిస్థాన్ కావాలన్న జిన్నా డిమాండ్ అడ్డుగా మారింది. ఈ దశలో గాంధీజీ హిందూ - ముస్లిం వర్గాలకు మధ్య వారధిగా మారాడు!
బ్రిటన్ రెండో ప్రంపచయుద్ధానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో అందుకు కాంగ్రెస్ దూరంగా ఉండగా, పరస్పరం కత్తులు దూసుకునే జిన్నా, వీడి సావర్కర్ బ్రిటిషర్లకు మద్దతు ఇచ్చారు. యుద్ధానంతరం తీమకు పెద్ద స్థాయిలో పాత్ర పోషించే అవకాశం ఉంటుందని, అధినివేశ ప్రతిపత్తిగల రాజ్యం వస్తుందని వీరిద్దరూ విశ్వసించారు. వ్యక్తిగతంగా ఇస్లాంను పాటించని జిన్నా ముస్లింలను రెచ్చగొట్టేందుకు పలు యుక్తులను పన్నేవారు. రక్తపాతం సృష్టించి మరీ దేశభక్తి కి జిన్నా కారకుడయ్యాడు.
మహాత్మా గాంధీని నాదూరాం గాడ్సే హత్య చేయడానికి గల కారణాల్లో ఒకటి - ఆయన 'పాక్ పిత' జిన్నాను గొప్ప నాయకుని గా కీర్తించడమే! నాదూరాం ను దేశభక్తునిగా కీర్తించే వర్గాలు జస్వంత్ సింగ్ ను పార్టీనుంచి తొలగించాలని భావించడంలో ఆశ్చర్యపోవాలసింది లేదు.
జిన్నాను కీర్తిస్తే, వివర్శలు చెలరేగుతాయని సింగ్ ఊహించాల్సింది. టీవీ లో చర్చలు- సమీక్షల కారణంగా ఆయన రాసినపుస్తకం బాగా అమ్ముడుపోచ్చు. కానీ మూడు దశాబ్దాల అనుబంధం గల పార్టీ - ఆయన మొహానే తలుపు మూసింది! కనీసం ఫోన్ చేసి కూడా చెప్పకుండా పార్టీ నుంచి జస్వంత్ ను బహిష్కరించారు. తన పుస్తకాన్ని చదవకుండానే ప్రజాభిప్రాయం తీసుకొందని ఆరోపించినా ఫలితం లేదు! దేశవిభజన వాదానికి కారకుడైన జిన్నాను ఏ భారతీయుడు మాత్రం హర్షిస్తాడు!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|