|
|
Articles: TP Features | కరవును ప్రేమిద్దాం! - Site Administrator
| |
గుజరాత్ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా సాగు నీటి రంగంలో 27372 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. తద్వారా వ్యవసాయానికి రైతులకు విద్యుత్ సరఫరాను 8 గంటల నుంచి 19 గంటలకు పెంచగలిగింది. రైతులకు ఇచ్చే సబ్సిడీ వ్యయం పెరిగింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ ఏడాది ఉపాధి హామీ కింద కూలీకి చెల్లించే దినసరి మొత్తాన్ని 80 నుంచి 120 రూపాయలకు పెంచింది.
దేశంలో 1960లో హరిత విప్లవం ద్వారా ప్రభుత్వాలు ఆహార స్వావలంబన సాధించాయి. అయినా కూడా కరవు తీవ్రతను తట్టుకునేందుకు 2002లో ఉపాధి హామీ అవసరమైంది. దేశంలో రైతుల్ని ఆదుకునేందుకు కాలువలతో పాటు గిడ్డంగుల నిర్మాణం, గిట్టుబాటు ధర కల్పించాలి. వీటన్నింటిని సమకూర్చ గలిగినప్పుడే రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అగత్యం తప్పుతుంది. ఇందుకు ప్రభుత్వం ఐటి రంగం, ఇతర పారిశ్రామిక రంగాలపై దృష్టిని కాస్త తగ్గించాలి. వారికి ఇస్తున్న రాయితీల్లో కొంతైనా రైతులకు అందజేయాలి. పరిశ్రమలను స్థాపించిందేకు పారిశ్రామిక వేత్తలకు ఎకరాన్ని కేవలం 1 రూపాయికే కట్టబెట్టే ప్రభుత్వాలు రైతుకు రుణాలను మాఫీ చేయాలంటే మీనమేషాలు లెక్కిస్తాయి. రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు అంగీకరించడం లేదని కుంటి సాకులు చెబుతాయి. కరవు మండలాలుగా ప్రకటించడానికి వానలు కురవక పోతాయా అన్నట్టుగా ఆకాశం వంక చూస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి ముందు చూపుతో వ్యవసాయం రంగంలో కేటాయింపులు ఇబ్బడిముబ్బడిగా పెంచకపోతే వ్యవసాయం రైతుకు మృత్యుప్రాయంగానే ఉంటుంది. సేద్యాన్ని పండగ చేయాలంటే ప్రభుత్వాధి నేతలు పెద్ద మనసు చేసుకోవాల్సిందే. అప్పుడే ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అన్నానికి లోటు ఉండదు. దేశ ప్రగతికీ, భవితకూ భరోసా ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|