|
|
Articles: TP Features | నైవేద్యం లేని పూజారులు - Site Administrator
| |
'ఉదయం నుండి అర్థరాత్రి వరకు కొలువు చేసే వారిని దేవస్థానం ఉద్యోగులుగా కూడా గుర్తించరు. రోజువారీ కార్మికులతో సమానం' అని ఒక అర్చకస్వామి ఆవేదన వెళ్ళగక్కాడు. తిరుచానూరు, తిరుమల, కపిలతీర్థం వంటి చోట్ల పనిచేసే పదిమందికి పైగా అర్చకులు మినహా మిగిలిన వారికి ఎటువంటి సౌకర్యాలు లేవు. పని గంటలు, వైద్య సౌకర్యం, కనీసం గుర్తింపు కార్డు కూడా నోచుకోని జీవితాలు ఈ పూజారులవి. 'తిరుమల తిరుపది దేవస్థానం ఉద్యోగుల్లాగా మాకు బస్ పాస్ లు లేవు. నివేశన స్థలాలు లేవు. ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు. ఇందిరమ్మ ఇల్లూ ఆదరించని బతుకులు మావి' అని మరో పూజారి నిర్వేదం చెందాడు. తిరుమలలోని ప్రధాన అర్చకులను మినహాయిస్తే అర్చకులకు నెలకు పదివేలు, సంభావన అర్చకులకు ఆరువేల రూపాయలు మాత్రమే ముడుతుంది.
తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం పూజారి స్వామివారి ఆభరణాలను తాకట్టు పెట్టుకోడంతో అర్చకుల దయనీయ జీవినం మరోసారి వెలుగు చూసింది. 'లక్ష్మీపతి'కొలువులో పనిచేస్తున్న పూజారుల జీవితాల్లో 'లక్ష్మీ కళ' తెచ్చేందుకు ఇకనైనా టిటిడి కానీ, ప్రభుత్వం కానీ దృష్టి పెడుతుందా ? ఎప్పటిలా విచారణలు, కమిటీలు - నివేదికలతో పరిష్కారం అటకెక్కుతుందా అన్నది మౌలిక ప్రశ్న. అన్నట్టు దరిద్రంలో మగ్గుతున్న పూజారుల జీవితాల్లో కొంతైనా వెలుగు తేవాలని గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం 75 కోట్ల రూపాయలతో అర్చక సంక్షేమనిధిని ఏర్పాటు చేయాలని భావించింది. ఆ ప్రతిపాదన ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితులున్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|