|
|
Articles: TP Features | కొత్త సిఎంపై ఆచి తూచి... - Site Administrator
| |
కానీ, రాజకీయాలు అంత సులువుగా ఏమీ ఉండవు. కనిపించీ కనిపించని సమీప సుదూర దృష్టితో చేసే వ్యూహాలు, కుట్రలు, చిత్ర విచిత్రమైన సమీకరణలు అందులో ఇమిడి ఉంటాయి. వైఎస్ కుటుంబం క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తుంది. కనుక కులంతో పాటు ఇక్కడ మతం ప్రభావం కూడా ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంటుంది.
రాజ్యాధికారం, డబ్బు, సెక్స్ ఎవరితోనైనా ఎలాంటి పనినైనా చేయిస్తాయన్నది జగమెరిగిన సత్యం. ఈ కోరికలను తీర్చుకోవడంలో మనుషులు ఉచ్ఛ నీచాలు, వావి వరుసలు, నీతి నియమాలను పక్కన పెట్టేసిన సందర్భాలు గతంలో లేకపోలేదు.
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మాతృమూర్తి మరణశయ్యపై ఉంటుంది. ఆమెను కనిపెట్టుకొని రాత్రంతా గాంధీ కాపలా ఉండాల్సి వస్తుంది. మధ్యరాత్రి గాంధీకి కస్తూరిభాపై మనసుమళ్ళి ఆమె గదికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి గాంధీ తల్లి మరణించి ఉంటుంది. ఈ విషయమై గాంధీజీ తనను తాను ఎన్నటికీ క్షమించుకోలేకపోతున్నానని వివరణ ఇచ్చుకున్నాడు. మహాత్ముడు కనుక అలా మాట్లాడాడు. ప్రస్తుత సమాజంలో డబ్బు చేయిస్తున్న దుర్మార్గాలను మీడియాలో ప్రతిరోజూ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక అధికారం చేయించే దుశ్చర్యలకు అంతే ఉండదు. ఒక కుతుబ్ షాహి రాజు 80 ఏళ్ళు పైబడిన తన తండ్రి రాచమసీదులో నమాజ్ చేస్తుంటే వెనుక నుండి తల్వార్ తో తల నరికి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు. అలాగే ఔరంగజేబు అధికారం కోసం కన్నతండ్రిని ఖైదు చేసి ఒక సోదరుడిని చంపి, మరో సోదరుడిని వ్యసనపరుడుగా మార్చి, ఇంకొకడిని దేశాంతరాలకు పంపి అధికారం పీఠాన్ని హస్తగతం చేసుకుంటాడు. అశోకుడు తన నూర్గురు సోదరులను కారాగారంలో బంధించి సింహాసనాన్ని అధిష్టిస్తాడు. వెనక్కి తరచి చూస్తే సుదూర, సమీప గతంలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఎన్నో కనిపిస్తాయి. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన ఘటన పలువురికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మార్గం ఏదైనా పరవాలేదు. లక్ష్యం సాధించడం రాజ్యాధికార సాధన స్వభావంగా ఉంటుందన్నది రాజకీయ సూత్రం. రాజ్యాధికార సాధన అపనిందలకు, హింసకు, విమర్శలకు, చరిత్రకు తదితరమైన వేటికీ వెరవదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|