|
|
Articles: My Thoughts | శ్రీశ్రీ తెలుగుల సిరి - Site Administrator
| |
నాకు తెలిసిన లక్షణమూ లక్ష్యమూ ఒకేచోట సంగమించిన 'కవితా ఓ కవితా' లాంటి మహోన్నత కావ్యం మరే భాషలోనూ లేదు. రాక్షసరతికి గురైన పడుపుకత్తె భయంకర బాధల పాటల పల్లవి కూడా కవిత్వపు వస్తువు కాదగినదని చెప్పిన కవి ఎవరైనా ఉన్నారా? 'నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా' చేస్తానని చెప్పిన కవి శ్రీశ్రీ. దేశ చరిత్రలు' లాంటి విశ్లేషణాత్మక కవిత కూడా కవిత్ర చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది.'ఇతిహాసపుచీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు' అనే ఆశయం మానవజాతి సాంస్కృతిక చరిత్రను పుననర్నిర్మించాలనే భావనను ప్రతిబింబిస్తుంది.
ఇలాంటి కొత్త అలను కవిత్వ చరిత్రలో సృష్టించిన యుగకర్త వెనక అచ్చమైన పసిబాలుని వంటి శ్రీశ్రీ అనే వ్యక్తి ఉన్నాడు. 1970 నుండి 1983లో చనిపోయేందుకు రెండు వారాల ముందు వరకు నేను శ్రీశ్రీని ఎన్నో సార్లు కలిశాను. 1970లో షష్టిపూర్తి సందర్భంగా శ్రీశ్రీకి సన్మానం ఏర్పాటు కావడం, ఆ ఊబిలోంచి బయటపడి శ్రీశ్రీ విరసానికి అధ్యక్షుడు కావడం, తర్వాత ఉద్యమాలు వగైరాల్నింటినీ సూక్ష్మంగా పరిశీలించినవాడిని. 1970 తర్వాత ఎప్పుడు మద్రాసు వెళ్ళినా శ్రీశ్రీని కలిసేవాడిని. అందువల్ల ఒక వ్యక్తిగా, ఆత్మీయుడిగా నా అనుభవాలను కూడా పంచుకోవలసి ఉంటుంది. శ్రీశ్రీతో అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరకంగా ఉంటాయి. 'వెలుగు నీడలు' అన్న మాటకి వ్యాఖ్యానంలాంటిది శ్రీశ్రీ జీవితం. 'వెలుగు నీడలు' సినిమాలోనే 'కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు' అని అద్భుతమైన పాట రాశాడు శ్రీశ్రీ. 'అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాని సుఖమున్నదిలే' అని ముత్యాల్లాంటి మాటల్ని పాటల్లో పొదిగాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|