|
|
Articles: Devotion | ధన్యజీవి - Site Administrator
| |
అందుకే మంచి గృహస్తునిగా మారి, అష్టపాశాలయిన అసూయ, సిగ్గు, భయము, చింత, జుగుప్స కులాభిమానము, ప్రతిష్టాభిమానులను వదులుకుని, సద్భుద్దితో, నిష్కల్మషమయిన భక్తితో, సదా సాయి మహాదేవుని మదిలో నిలుపుకుని ప్రతి మనిషిలోను సాయినే చూస్తూ, చేతనయిన సహాయాన్ని చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
కుల, మత, వర్గ వైషమ్యాలు ప్రబలి కల్లోలాన్ని సృష్టిస్తున్న సమయంలో 'సబ్ కా మాలిక్ ఏక్ హై!' అందరి దైవము ఒకడే అనే భక్తి సిద్దాంతాన్ని ప్రభోదించటానికి అవతరించిన కలియుగ దైవం శ్రీ సాయిబాబా. భక్తులకు అతి సులభంగా పశమయిపోతాడు శ్రీ బాబా. నిష్కామము, నిష్కళంకము, నిర్మలమైన భక్తితో సాయినామ సంకీర్తన చేస్తే చాలు భక్తుల కడగండ్లు బాపి వారి జీవితాన్ని సుఖమయం చేస్తాడు బాబా.
వెన్నలాంటి మనస్సాయనిది, ఎటువంటి పాపాత్ముడయిననూ తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి 'బాబా రక్షింపమని' నోరారా పిలిస్తే చాలు పరుగున వెళ్ళి ఆదుకుంటాడు. ఎన్నో సంఘటనలు, సంఘటనలలో దృష్టాంతరాలు, ఆయన మహిమల్ని చాటి చెప్తుంటాయి. మనసారా సాయినామ స్మరణ చేస్తే చాలు పిరికివాడికి ధైర్యాన్నీ, దరిద్రుడికి ధనాన్నీ, అసహాయుడికి బలాన్నీ, పామరుడికి పాండిత్యాన్ని, విరాగికి మోక్షాన్నీ ప్రసాదిస్తాడాయన. అటువంటి దైవాన్ని నామసంకీర్త చేసుకుంటూ, భయ దు:ఖాల్ని పోగొట్టుకొని, పాపప్రక్షాళన చేసుకుంటూ అందరూ సుఖశాంతులు పొందాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|