|
|
Articles: Devotion | అష్టాదశ శక్తిపీఠాలు - Site Administrator
| |
కామాక్షి - కాంచీపురం నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల - ప్రద్యుమ్న నగరం, ఇది కొలకత్తా కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
జోగులాంబ - అలంపురం, కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రానదిగా కలిసే స్థలంలో ఉన్నది.
భ్రమరాంబిక - శ్రీశైలం, కృష్ణానది తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి
మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
మహాకాళి - ఉజ్జయిని, మధ్యప్రదేశ్ ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది కృష్ణానది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
గిరిజ - ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.
మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం, బ్రహ్మపుత్రానదీ తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తరప్రదేశ్, త్రివేణీసంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచలప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి - గయా, బిహార్ - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
విశాలాక్షి - వారణాశి, ఉత్తరప్రదేశ్.
సరస్వతి - జమ్మూ - కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|