|
|
Articles: My Thoughts | పత్రికల పుట్టుక-పరిణామం - Site Administrator
| |
ఆంధ్రదేశంలో పుట్టిన పత్రికలను వరుసగా చూసినట్లయితే 1747లో మొదటి తెలుగు బైబిలు ముద్రణతో తెలుగులో ముద్రణ ప్రారంభమై 1831 సంవత్సరంలో కొన్ని తెలుగు పత్రికలు క్రైస్తవ మిషనరీల యాజమాన్యంలో ప్రారంభమయినాయి. ఆ తర్వాత 1818లో బందరు నుండి 'మితవాది', 1835 సంవత్సరంలో బళ్ళారి నుండి 'సత్యదూత', 1844 సంవత్సరంలో గాజుల నరసింహశెట్టి మద్రాసు నుండి 'క్రిసెంట్' వంటి పత్రికలు నడిచాయి. ముఖ్యంగా 1838లో తొలి తెలుగు దేశీయ పత్రిక 'వృత్తాంతిని' మద్రాసు నుండి ప్రారంభించబడింది. 1842లో వర్తమాన తరంగిణి, 1863లో బళ్ళారి నుండి శ్రీయక్షిణి, 1865లో తత్వబోధిని, 1865లో 'స్వదేశి జన అభిప్రాయం' (నేటి పబ్లిక్ ఒపెనియన్) అనే ద్విభాషా పత్రిక వంటివి ప్రారంభించబడినాయి. 1872లో బందరులో ఉమారంగనాయకులు ప్రారంభించిన 'పురుషార్ధప్రదాయిని'తో ఆంధ్రదేశాన నూతన యుగానికి నాంది పడినది.
తెలుగు సమాజోద్ధారకుడిగా పేర్గాంచిన వీరేశలింగంగారు 1874లో వివేకవర్ధిని, 1875లో 'హాస్యసంజీవిని', 1883లో 'సతీహితబోధిని', 1892లో 'సత్య సంవర్ధిని', 1905లో 'సత్యవాదిని' వంటి పత్రికలను రాజమండ్రి నుండి నడిపి వాటిని తన పోరాట ఆయుధాలుగా చేసుకొని, ఆనాటి సమాజంలో గల అవినీతిపరుల, లంచగొండుల పాలిటి సింహస్వప్నం అయ్యాడు. 1885లో ఏవి పార్థసారధి నాయుడు 'ఆంధ్రప్రకాశిక', 1874లో గట్టుపల్లి శేషాచార్యులు 'శశిరేఖ', 1896లో బెజవాడ నుండి దేవగుప్తల శేషాచలపతిగారు 'దేశాభిమాని' వంటి పత్రికలను ప్రారంభించారు. ఈ 'దేశాభిమాని' మొదట వారపత్రిక కాగా తర్వాత దినపత్రికగా మారింది. వీరేశలింగం గారి శిష్యుడు షూజాయత్ అలిఖాన్ 'విద్వాన్ మనోహరిణి'ని నర్సాపురం నుండి నడిపాడు. న్యాయపతి సుబ్బారావు 'చింతామణి', రాయసం వెంకట శివుడు 'జనానా పత్రిక'ను నడుపగా 1885లో నెల్లూరు నుండి పూండ్ల రామకృష్ణయ్య 'ఆముద్రిత గ్రంధ చింతామణి' 1919-20 ల మధ్యకాలంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు సతీమణి రాంబాయి మద్రాసు నుండి 'సౌందర్యవల్లి' పత్రికను నడిపారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|