|
|
Articles: TP Features | భవితనూ కాపాడుకోవాలి - Site Administrator
| |
సరిగ్గా ఇప్పుడే, కర్నాటక రాష్ట్రంలో మాతృభాష మాధ్యమంలో 4వ తరగతి వరకు విద్యాబోధనను తప్పనిసరి చేసే కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దుచేస్తూ, జూలై 21న సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. దురదృష్టవశాత్తూ - ఈ తీర్పు 'ఇప్పుడు వీస్తున్న గాలి'నే సూచిస్తున్నది తప్ప దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలను శక్తివంతం చెయ్యదు. ఈ పరిస్థితుల్లో మాతృభాషల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో మనం ఆలోచించుకోవాలి. భాషలతో పాటు, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి యునెస్కో హెచ్చరికల్నీ పరిగణించాలి. మార్కెట్ శక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక సామ్రాజ్యవాదులకు కొమ్ముకాస్తున్న ప్రపంచబ్యాంకునూ, దానిని నియంత్రించే వారినీ కాదని ప్రపంచశాంతికీ, శ్రేయస్సుకూ బాధ్యతను స్వీకరించలేని స్థితిలో ఉన్న బలహీన సంస్థ ఐక్యరాజ్యసమితి అనే కఠిన వాస్తవాన్ని మనం గమనించాలి.
యధాలాపంగా అన్నారనుకోనక్కర్లేదు గాని, మాతృభాషలో విద్యను నేర్పితే (కనీసం ప్రాథమిక స్థాయిలోనైనా) కనీసం గుమాస్తాలుగా కూడా ఆ విద్యార్థులు తయారుకాబోరన్న అభిప్రాయం ఉన్నత న్యాయస్థానం నుంచి రావడంతో - ఇంగ్లీష్ చదివితేనే పిల్లలకు కనీసం గుమాస్తా ఉద్యోగాలు వస్తాయన్న సామాన్య తల్లుల ఆలోచనకు మించిన ఆలోచన ఏమీ తెలియడం లేదు. అసలు ఇంగ్లీష్ ను ఒక భాషగా నేర్పవద్దని ఎవరన్నారు గనుక?! ప్రాథమిక విద్య తర్వాత చదువుల్లో ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్ళడాన్ని ఎవరు అడ్డుకొన్నారు గనుక?! తమ ప్రజల భాషలో బోధించడం శాస్త్రీయ పద్ధతి కాదనగల వారెవరు? రెండవ భాషనూ, క్రమంగా మూడవ భాషనూ నేర్చుకోగల విధంగానే మన త్రిభాషా సూత్రం ఉన్నదే! మరి రాజ్యాంగంలో 350వ అధికరణం ఎందుకున్నట్లు? వివిధ రాష్ట్రాల్లోని భాషాపరమైన అల్ప సంఖ్యాకులకు ప్రాథమిక విద్య విషయమై ఇచ్చిన రక్షణను తొలగించడానికి ఆ అధికరణాన్ని రద్దుచేయాలని ఎవరైనా కోర్టుకు వెళితే - ఇప్పుడున్న అంతర్జాతీయ అవసరాల దృష్ట్యా - న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయా?
కేంద్రంలో విధానాలకు తలవొగ్గి అన్ని విధాలా అనుసరించడం, ఏమీ ప్రశ్నించకుండా అన్ని అవమానాలనూ దిగమింగి లభించిన దానితో సంతృప్తిపడడం మాత్రమే నేర్చుకొన్న మన రాష్ట్రం - భాష విషయంలో అయితే 'గాలివాలు'కు కొట్టుకుపోయే విధానంలో రాటుతేలి, కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అందుకే విద్యారంగంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకొని సంపూర్ణ ప్రయివేటీకరణ దిశగా ముందుకు సాగుతోంది. అందుకే అన్ని విధాలుగా మన భాషను మనమే అణచివేసుకోవడంలో ముందున్నాం. ప్రాథమిక విద్యలో తల్లి భాష మాధ్యమాన్ని ఎటువంటి తరతమ భేదాలు లేకుండా రాష్ట్ర వ్యాపితంగా అమలు చెయ్యాలని భాషోద్యమకారులు కోరుతున్న కోరికను పెడచెవిని పెట్టి, దాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు పనికొచ్చే విధంగా మలచుకొన్న ఘనత కూడా మన నాయకులదే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|