|
|
Articles: My Thoughts | 'పింగళి'కి ప్రాణం పోద్దాం!! - Site Administrator
| |
నాటక సాహిత్యం మీద అనేకమంది చేసిన పరిశోధనా పత్రాలను తిరగేశాను. వాటిని చదివిన తర్వాత... పింగళి నాగేంద్రరావు సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ముందు బందరు మహానటుడు దేవరకొండ వెంకట సుబ్బారావు కంపెనీకి మేనేజర్ గా పని చేశారని తెలిసింది. 1928 ప్రాంతంలో... పింగళి రాసిన వింధ్యరాణి, జేబున్నీసా నాటకాలు కృష్ణాపత్రికలో సీరియల్ గా వచ్చిన విషయం తెల్సుకున్నాను. భారతిలో నారాజు నాటకం ధారావాహికంగా వచ్చిందని తెల్సుకున్నాను.
ఇంకేం వెంటనే బందరు బస్సెక్కి అక్కడ ఓ మిత్రుడ్ని పట్టుకుని అతని సాయంతో డి.వి.సుబ్బారావు గారింటికి వెళ్ళాను. ఆయన కుమారులో, మనవళ్ళో ఎవరో ఒకరు.... నాగేంద్ర్రరావుగారి నాటకాలు ఇవ్వకపోతారా? అనుకున్నాను. తీరా అక్కడకు వెళ్ళాక తెల్సింది. సుబ్బారావుగారి పిల్లలు ఆ ఇల్లు అమ్మేసి పదేళ్ళపైనే అయిందని. అయితే సుబ్బారావుగారి మనవడు డి.వి.మోహనకృష్ణ హైదరాబాద్ ఆకాశవాణిలో దొరుకుతారు కదండీ... ఇక్కడిదాకా వచ్చారు... అని ఆ సందులో ఒకాయన నా అమాయకత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే హైదరాబాద్ వచ్చేసి ఆకాశవాణికి వెళ్ళి మోహనకృష్ణగారిని కల్సాను. ఆయన నా గొడవ అంతా విని మీకు ఈ విషయంలో సహాయం చేయగలిగింది మా బాబాయిగారే అన్నారు.
ఆయన అడ్రస్సు చెప్పమన్నాను. గుంటూరులో ఉంటారని చెప్పి డి.వి.సుబ్బారావుగారి ఆఖరి పుత్రుడు నటరాజశేఖర్ గారి అడ్రస్ ఇచ్చారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|