|
|
Articles: TP Features | అపురూప కవి అన్నమయ్య - Site Administrator
| |
పదాలు నిఘంటువుల్లో ఉంటాయి. శ్రీశ్రీ చెప్పినట్లు అవి శ్మశానాల లాంటివి. ఆ పదాలకు జీవంపోసి రచనగా మలచే శక్తి రచయితకుంటుంది. మామూలుగా మనం వాడే పదాలు ఒకటి రెండు వేలకు మించవు. అలాంటిది షేక్ స్పియర్ కంటే ముందే 13వ శతాబ్దిలోనే తిక్కన మహాకవి 26,000 పదాలు వాడి 16,500 పద్యాలు అర్థవంతంగా రాసి 'ఆంధ్రావళికి మోదం' చేకూర్చాడంటే గర్వించాల్సిన విషయమే.
సంస్కృతంలో వ్యాసభారతం ఒక్క వ్యాసుడే రాశాడన్నది నిజంకాదు. 'జయం' అన్న వీరగాథ వ్యాసుని చేతిలో భారతమై, ఆ తర్వాత ఎంతోమంది చేతులుపడి మహాభారతమయింది. దానిలో లక్ష శ్లోకాలున్నాయి. అంటే రెండు లక్షల పంక్తులున్నాయి. ఇంత పెద్ద మహా కావ్యం ప్రపంచంలో మరొకటి లేదు. అయితే ఈ మహాభారతం ఒక్కరు రాసింది కాదు, తర్వాతి కాలంలో ఎంతోమంది రచనలు దానిలో చేరిపోయాయి. అది ఇతిహాసం, పురాణం. అయితే ఒక్కచేతితో జీవితకాలమంతా వెచ్చించి అటు సంగీతానికి, ఇటు సాహిత్యానికి పనికి వచ్చేలా 32,000 సంకీర్తనలు రచించిన అన్నమయ్య లాంటి రచయిత ప్రపంచంలో మరొకరు ఉన్నారా అనిపిస్తుంది. రోజుకో సంకీర్తన చొప్పున దశాబ్దాల పాటు నిరంతరాయంగా రచనలు చేసి జనతకర్పించిన మహాకవి మరెవరైనా ఉన్నారా అని ఆలోచించవలసి ఉంది.
నిజానికి అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాయటం ఆయన శక్తికి మించిన పని కాదు. ఆ కవి శక్తి అలాంటిది. ఈ సంకీర్తనల్ని రాగిరేకులలో భద్రపరచటమన్నది ప్రపంచంలోనే అపూర్వమైన విషయం. అన్నమయ్య కీర్తనల్లో ఎక్కువగా 14 పాదాలున్నాయి. 32,000 సంకీర్తనలు, 14 - మొత్తం లెక్కవేస్తే 4,68,000 పంక్తులు. ప్రపంచంలో ఏ కవీ ఇన్ని పంక్తుల సంకీర్తనల్ని రాశాడంచే నమ్మశక్యం కాదు. రెండు వ్యాస మహాభారతాల కంటే ఎక్కువ రచన. ఇప్పటివరకు దొరికినవే అన్నమయ్యవి 12,000 సంకీర్తనలున్నాయి. అంటే 1,68,000 పంక్తులన్నమాట. రాగ తాళాలతో, ఎన్నో అపూర్వ రాగాలతో, అంతకు ముందు ఎవ్వరూ చెయ్యని పనిని అన్నమయ్య చేశాడని మనం ఎంత గర్వపడాలి! ఎంతగా ఈ కవి ప్రతిభని, విస్తృతిని, వ్యుత్పత్తిని చాటి చెప్పాలి!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|