|
|
Articles: TP Features | భద్రతపై ఉదాసీనత - Site Administrator
| |
రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడానికి ప్రధాన కారణం ఆయనకు భద్రత తగ్గించడమే అనడంలో ఎవరికీ అనుమానం లేదు. ఆనాడు రాజీవ్ గాంధీకి భద్రత తగ్గించడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్న నారాయణన్ తీసుకున్న నిర్ణయమే కారణం. అలాంటి అధికారిని యుపిఎ ప్రభుత్వంలో భద్రతా సలహాదారుగా నియమించడం ఆయనకు ప్రభుత్వంలో గల పలుకుబడిని వెల్లడిస్తున్నది.
అలాగే, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో సైతం ప్రతిభను పట్టించుకోకుండా తమ స్వార్థ ప్రయోజనాలు కాపాడేవారిని అందలం ఎక్కించారు. అందుకనే ముఖ్యమంత్రి భద్రత పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరించినా అలాంటి అధికారులపై చర్య తీసుకోవాలని అధికార పక్షంలో ఎవ్వరూ నోరు మెదపడంలేదు. రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు కడప జిల్లాలో జరిగిన ఏర్పాట్లు, పోలీసుల గౌరవ వందనం లేకుండా అంత్యక్రియలు జరగడం - ఇవి ఉన్నతాధికారులపై వైఫల్యాలు అడుగడుగునా బయటపడుతున్నాయి.
హోంమంత్రితో సహా అనేక మంది మంత్రులు, ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు బయలుదేరి వెళ్ళినా ట్రాఫిక్ అవరోధాల కారణంగా ఇడుపులపాయ చేరుకోలేకపోయారు. అయితే, డిజిపి మాత్రం హెలికాప్టర్ లో వెళ్ళగలగడం అంతా ప్రజాప్రతినిధుల పట్ల ఉన్నతాధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీనతకు నిదర్శనం.
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో నదిలో బోటుపై ప్రయాణిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులపై మావోయిస్టులు విరుచుకుపడి పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించినప్పుడూ ఉన్నతాధికారుల వైఫల్యం వెల్లడైంది. అయినా ఒక్క ఉన్నతాధికారిపై చర్య తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అదనపు డిజిపి వివేక్ దూబెను మాత్రం అర్ధంతరంగా సస్పెండ్ చేశారు. ఆయన తన ఇంటిలో పనికి కానిస్టేబుల్స్ ను ఢిల్లీకి పంపించడమే నేరం. అయితే, రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది ఉన్నతాధికారులు హైదరాబాద్ లోని తమ ఇళ్ళల్లో ఆ విధంగా 'అనధికారికంగా' ఎంత మందితో పని చేయించుకుంటున్నారో? తీవ్రమైన భద్రతా వైఫల్యాలకు బాధ్యులైన ఉన్నతాధికారులపై మాత్రం ఎలాంటి చర్యా తీసుకోరు. ఇలాంటి ఉదాసీన వైఖరే రాజశేఖరరెడ్డి మరణానికి దారి తీసిందని చెప్పక తప్పదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|