|
|
Articles: TP Features | కార్పొరేట్ యోధులు - Site Administrator
| |
'ప్రతి సంవత్సరం సైనిక దళాల నుంచి రమారమి 60 వేల మంది ఆఫీసర్లు, సిబ్బంది రిటైరవుతుంటారు. రిటైరయ్యే సిబ్బంది 35, 45 ఏళ్ల వయో వర్గంలో ఉంటుంటారు. వీరు సుశిక్షితులైన, క్రమశిక్షణ గల మానవ వనరులు కనుక వీరికి రెండవ కెరీర్ ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉంది. వీరిని తీసుకోవడానికి కార్పొరేట్ రంగంలో సుముఖత ఎక్కువగానే కనిపిస్తున్నది. రిటైరైన రక్షణ సిబ్బందిని వేరే ఉద్యోగాలకు లేదా స్వయం ఉపాధికి సిద్ధం చేసేందుకు, కార్పొరేట్ ప్రపంచానికి వీరి మార్పు సాఫీగా సాగిపోయేట్లు చూసేందుకు ఐఎంటి - సిడిఎల్ ప్రోగ్రామ్ లు సుకరంగా ఉంటాయి. మేనేజ్ మెంట్ రంగంలో అన్ని ఫంక్షనల్ విభాగాలలో నైపుణ్యాన్ని పొందేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. ఐఎంటి - సిడిఎల్ లో కోర్సులు మార్కెటింగ్ మేనేజ్ మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ వంటి కీలక విభాగాలలో విద్యార్థులను సుశిక్షితులను చేస్తాయి. కార్పొరేట్ యుద్ధరంగంలో పోరుకు రక్షణ సిబ్బంది సైనిక దళాలలో తమ అనుభవాన్ని సమర్థంగా వినియోగిస్తున్నారు' అని ఐఎంటి - సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ (సిడిఎల్) డైరెక్టర్ డాక్టర్ అరుణ్ మోహన్ షెర్రీ తెలియజేశారు.
ఎన్ఎంఐఎంఎస్ లో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ వివరాలను అగర్వాల్ ఇంకా తెలియజేస్తూ, 'ఆఫీసర్ల కోసం ఉద్దేశించిన మేనేజ్ మెంట్ కోర్సు ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసే ఉన్నత స్థాయి కోర్సు. వివిధ కార్యకలాపాల రంగాలలో ఒక్కొక్కదానిలో ప్రాథమిక పరిజ్ఞానంతో ఈ ఆఫీసర్లను సుశిక్షితులను చేయడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం' అని చెప్పారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|