|
|
Articles: TP Features | పాపం! ప్రజారాజ్యం - Site Administrator
| |
ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీ తీసుకోవలసిన రక్షణ పద్ధతులను గాలికి వదిలేసి డిఎస్ రమ్మనగానే ప్రజారాజ్యం కంగారుగా కాంగ్రెస్ గుహలోకి వెళ్ళిపోయింది. అదీ పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు కాకుండా ఏ పదవీ లేని అల్లు అరవింద్ పొత్తు దౌత్యానికి వెళ్లడం ఆరంభంలోనే తప్పుడు సంకేతాలను ఇటు స్వపక్షీయులకు, అటు ఆహ్వాన పక్షానికి ఇచ్చింది. అయితే, కాకపోతే అన్న మీమాంస ప్రజారాజ్యం వ్యూహకర్తలకు, మేథావులని చెప్పుకుంటున్న సీనియర్లకు రాకపోవడం చాలా విచిత్రం. అంటే ప్రజారాజ్యంలో కూడా పొత్తు విషయమై పార్టీ నాయకత్వంలో విస్తృత చర్చకు పెట్టినట్టు లేదనే చెబుతున్నారు. బేరసారాలు ముగిసిన తరువాత పొత్తు ఖరారైనట్లు ముందుగా ప్రజారాజ్యం ప్రకటించి ఆతృతను బయటపెట్టుకుంది. బలహీనతలను చాటి చెప్పుకుంది.
పొత్తు విషయమై వెల్లువెత్తిన విమర్శలను తిప్పికొట్టడంలో, తమ విధానాన్ని సమర్ధించుకోవడంలో ప్రజారాజ్యం నాయకులు అవగాహన, అనుభవ రాహిత్యాలు ప్రదర్శించారనేది రాజకీయ విమర్శకులు అభిప్రాయం. కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారన్న ప్రశ్నకు ఆ నేతలు ఇచ్చిన సమాధానం చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం కోసమని, జోగయ్య నుంచి వాసిరెడ్డి పద్మ వరకూ ఇదే వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకుంటే ప్రజారాజ్యం నాయకుడు చిరంజీవి ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నది లాజిక్ కు అందేదా లేదా అన్నది ఆలోచించలేదని వారు విశ్లేషిస్తున్నారు. మరి ప్రజారాజ్యం కోరుకునే మార్పు ఈ పొత్తుతో ఎలా సాధ్యం? సామాజిక న్యాయం నినాదం సంగతి ఏమిటి? అధికారం వారికి (కాంగ్రెస్) కాకపోతే వీరికి (తెలుగుదేశం) కాదని, బడుగు బలహీన వర్గాలకే అధికారం అన్న ప్రజారాజ్యం విధానం కాంగ్రెస్ తో పొత్తు ద్వారా గ్రేటర్ లో ఏ విధంగా సాధిస్తారు? ఈ అంశాలను ప్రస్తావించిన పాపాన ప్రజారాజ్యం నాయకులు పోలేదన్నది ప్రధాన ఆరోపణ.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|