|
|
Articles: My Thoughts | ఫెయిల్యూర్ టు సక్సెస్ - Site Administrator
| |
(సిహెచ్. వైకుంఠరావు)
గత విద్యాసంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సక్సెస్ స్కూళ్ళు ఫెయిల్యూర్ బాటలో నడుస్తున్నాయి. సరియైన శిక్షణ, అనుభవం లేని ఉపాధ్యాయులు సెంట్రల్ సిలబస్ లో, ఆంగ్ల మాధ్యమంలో బోధించడం వల్ల పాఠ్యాంశాలు అర్థంకాక విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో సెంట్రల్ సిలబస్ బోధనపట్ల విముఖత వెల్లడిస్తున్నారు. కనుక సక్సెస్ స్కూళ్ళ గురించి పున:సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితి నెల్లూరు నగరంతో పాటు 10 మండలాల్లోని 22 పాఠశాలల్లో సక్సెస్ స్కూళ్ళ బాగోగుల గురించి నమూనా పరిశీలన చేసింది. సక్సెస్ స్కూళ్ళలో ఎక్కువమంది తెలుగు మాధ్యమం పాఠశాలల నుండి చేరగా కొద్దిమంది ఆంగ్ల మాద్యమం పాఠశాలల నుండి చేరారు. 2008-09లలో 6వ తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో 640 మంది విద్యార్థులు చేరగా, తెలుగు మాధ్యమంలో 2082 మంది విద్యార్థులు చేరారు. తెలుగు మాధ్యమంలో చేరినవారిలో విద్యా సంవత్సరం మధ్యలోనే 84 మంది ఆంగ్ల మాధ్యమం నుండి తెలుగు మాధ్యమానికి మారారు. 2009-10లో ఆంగ్ల మాధ్యమంలో 539 మంది చేరగా, తెలుగు మాధ్యమంలో 1969 మంది చేరారు. సక్సెస్ స్కూళ్ళలో ఆంగ్లమాధ్యంలో బోధించడానికి (రిటైర్ట్ అడిషనల్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ.పి.వీరభద్రారెడ్డి అంచనా ప్రకారం) ఒక్కొక్క పాఠశాలకు 13 మంది ఉపాధ్యాయులు అదనంగా కావాలి. ఆ లెక్కన 22 పాఠశాలలకు 286 మందిని నియమించాల్సి ఉండగా అదనంగా నియమింపబడ్డవారు 60 మంది మాత్రమే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|