|
|
Articles: My Thoughts | ప్రకృతి మీద పెత్తనం - Site Administrator
| |
మనదేశానికి పనికొచ్చే విధానాలను స్వదేశీ ఆలోచనా విధానంతో రూపొందించడం జరగలేదు. విదేశీ కంపెనీలు లేదా విదేశీ బ్యాంక్ లు సిద్ధం చేసి ఇచ్చిన పథకాలను ఉన్నది ఉన్నట్లుగా అమలుచేస్తూ అందులో తమకు దక్కే కమిషన్ గురిచి ఆలోచన చేస్తున్నారు. అందుకే పాలకుల, అధికార యంత్రాంగ ఆలోచనలకు, పథకాలకు, ప్రజల అవసరాలకు, ఆశయాలకు సంబంధం లేకుండాపోయింది. అంతేకాదు... ప్రభుత్వ అభివృద్ధి పథకాలలో గ్రామాలు మాయమవ్వాల్సి వస్తున్నది. గ్రామస్తులను బలవంతంగా బయటకు నెట్టేస్తున్నారు.పరిశ్రమల స్థాపనతో 'ఆమ్ ఆద్మీ' (సామాన్యుడి) జీవితం బాగుపడుతుందా? ఆమ్ ఆద్మీ జీవితాన్ని మార్చటానికే పరిశ్రమలు స్థాపిస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలకు 'అవును' అనే అంటున్నారు. ఏలినవారు. అయితే 'ఆమ్ ఆద్మీ' జీవితం మారటం వాస్తవమే అయినా ఆ మార్పు 'ఆమ్ ఆద్మీ' జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నది.
పరిశ్రమలు, జలయజ్ఞాలు... వంటి అభివృద్ధి పథకాలు ఏమైనా, ప్రజలు పుట్టిపెరిగిన చోటనుండి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తాము కట్టుకున్న ఇళ్ళు, పెంచిపోషించుకున్న చెట్టూ చేమా, అనుబంధం ఏర్పరచుకున్న ఏరు, సెలయేర్లు, పూజించిన నదులు, కొండలు, గుట్టలు, దేవాలయాలు వగైరాలన్నీ వదిలిపెట్టి, కట్టుబట్టలతో కొత్త చోటుకు వెళ్ళాల్సి వస్తున్నది. అలా వెళ్ళటానికి ఎవరైనా నిరాకరిస్తే పోలీసు లాఠీలు తగులుతున్నాయి. పోలీసు కాల్పులు బెదిరిస్తున్నాయి. కొత్త ప్రదేశంలో ఎలా బ్రతకాలి? వారికి ఆదాయం ఎటునుండి వస్తుంది? ఇవి ప్రభుత్వం పట్టించుకోని అంశాలు.
ఒక పరిశ్రమ స్థాపన పది నుండి 20 గ్రామాల పర్యావరణాన్ని ధ్వదంసం చేస్తున్నది. ఒక్కొక్క గ్రామంలో వెయ్యి నుండి రెండు వేల జనాభా వుంటారని అనుకుంటే... ఆ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా నష్టపోతున్న జనాభా ఇరవై వేల నుండి పాతికవేల వరకు ఉంటుంది. పాతిక వేల మంది ఉపాధిని మింగేసిన పరిశ్రమ ఉపాధి కల్పించేది ఎంతమందికి? మహా అయితే ఐదువేల మందికి. ఆ ఐదువేలలో అధికశాతం ఇతర ప్రదేశాల నుండి వచ్చే సాంకేతిక నైపుణ్యత కలిగినవారే. స్థానికులకు దక్కేది రోజువారీ కూలీ పనులే. అది కూడా కుటుంబంలో ఒక్కరికే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|