|
|
Articles: Devotion | సీతాదేవి శాపం - Miss rajeswari rajeswarinedunuri
| |
అందులకు సీత 'పల్గుణీ నదినీ, గోవును, అగ్నినీ, కేతకీ ('మొగలి పువ్వు ') పుష్పమును సాక్ష్యము చెప్పమని కోరినది. ఆశ్చర్యముగా సాక్షులు మారు బల్కక మిన్న కుండిరి. అందులకు బాధ పడి చేయునది లేక సీత స్నాన మాచరించి వంట కుపక్ర మించి సర్వము సిద్ధము చేసెను. తదుపరి రామ లక్ష్మణులు శ్రాద్ధము పెట్టుటకు ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించిరి. వారి పిలుపు నందుకున్న పితృదేవతలు 'కుమారులారా! ఇదిఏమి వింత? ఇంతకు పూర్వమే సీతాదేవి మమ్ములను ఇష్ట మృష్టాన్నములతో సంతృప్తి నొందించినది. మరల మరల ఏల పిలుచు చున్నారు' అని ఒక అశరీర వాణి సూర్య మండలము నుండి పలికినది. అందులకు శ్రీరామచంద్రుడు 'తాత తండ్రులారా జానకి మాటలను నమ్మ జాలక మిమ్ము శాస్త్రోక్త విధానముగా, మంత్ర పూర్వకముగా ఆహ్వానించితిమి మన్నింపుడు' అని బదులు బల్కెను . అందులకు 'ఇక శ్రాద్ధముతో పని లేదు. మేము తృప్తి గా భుజించితిమి పితృశేషమును ఇక మీరు భుజింపుడు' అని దశరధుడు అశరీర వాణియై బదులు పల్కెను. అంతట అన్న దమ్ములు వెరగు పడి సీతను లోలోన అభినందించిరి. ఇది ఏమి వింత అని రామ లక్ష్మణులు తల పోయుచుండగా సూర్య భగవానుడు వారికి సర్వము వివరించెను. పూర్తిగా విన్న పిదప సీతను వేనోళ్ళ కొని యాడి భుజించించిన పిమ్మట సీత భుజించినది.
మరి సాక్షులందరు తటస్థముగా నుండుట కేమి హేతువు అని ప్రశ్నించగా వెనువెంటనే సీత వారిని పిలిచి 'ఫల్గుణీ నది ఉన్నది ఉన్నట్టుగా తెలుపక దాచి నందుకు 'పాతాళ వాహినియై' పోవునట్లుగను, ఆవు ముఖ సందర్శనము అయోగ్య మగు నట్లుగను, కేతకీ పుష్పము పూజకు అనర్హమగు నట్లుగను,అగ్ని దేవుని సర్వ బక్షకుడుగను శపించెను. కావున ఆవు ముఖము చూడరాదు. అందుకనే వెనుక భాగము తోక వైపు చూడాలని ఆచరణ యోగ్య మైనది. ఫల్గునీ నది పాతాళ వాహిని గాను, ఇక అగ్ని మొగలి తెలిసినవే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|