|
|
Articles: Short Stories | భగవద్దర్శనం - Mr. Pratap Cherukuri Pratap
| |
ఒకరోజు చిదానంద మహర్షుల వారు రామశాస్త్రిని తనతో పాటు సముద్ర స్నానానికి రమ్మన్నారు. అలాగేనని గురువుతో పాటు వెళ్ళాడు రామశాస్త్రి. ఇద్దరూ నడుమ లోతు నీటిలోకి దిగి స్నానం చెయ్యసాగారు. ఇంతలో మహర్షుల వారు రామశాస్త్రి పిలక పట్టుకొని హఠాత్తుగా నీళ్ళలోనికి ముంచేసారు. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రామశాస్త్రి భయాందోళనలతో 'గురుదేవా! నన్ను రక్షించండి. నేను చచ్చిపోతున్నాను, నాకు ఊపిరి ఆడడం లేదు' అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేయసాగాడు. అంతే కాక ఒడ్డున పడిన చేపపిల్లలా కాళ్ళు, చేతులు గట్టిగా కొట్టుకోసాగాడు. గురువు గారు పట్టిన పట్టును విడువకపోయేసరికి ఇక తనకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని, తన అహంకారానికి గురువు గారీ విధంగా శిక్షిస్తున్నారని నిర్ణయించుకున్నాడు రామశాస్త్రి.
సరిగ్గా అప్పుడే శిష్యుని పిలక పట్టుకొని నీళ్ళ నుండి పైకి లాగారు మహర్షుల వారు. ఆ చర్యతో ఒకింత ఉపశమనం పొందాడు రామశాస్త్రి.
'నీళ్ళలో వుండేటప్పుడు నీకేమనిపించింది? దేని కోసం పరితపించావు?' ప్రశ్నించారు చిదానంద మహర్షి.
'గురుదేవా! నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఊపిరి అందలేదు. మరణం తధ్యమని భావించాను. కాస్తంత ఊపిరి లభిస్తే చాలని భావించాను' వినయంగ చెప్పాడు రామశాస్త్రి.
'నువ్వు ఇంతకాలంగా అడుగుతున్న ప్రశ్నకు ఇదే సమాధానం' చెప్పారు చిదానంద మహర్షి. 'నీటిలో మునిగిపోయినప్పుడు ఊపిరి కోసం,ప్రాణానికి రక్షణ కోసం ఎలా పరితపించావో అంతే ఆర్తితో భగవంతుని కోసం పరితపించినప్పుడు ఆ సర్వేశ్వేరుడు తప్పక తన దర్శన భాగ్యం కలుగజేస్తాడు. భగవద్దర్శనం కోసం కావల్సినంత కేవలం ప్రేమ, భక్తి మరియు తీవ్రమైన ఆకాంక్ష, ఐహికపరమైన కోరికలతో అనుక్షణం కొట్టుమిట్టాడే వారికి భగవద్దర్శనం అసాధ్యం. ఆ విధంగా కృషి చేసి నీ లక్ష్యాన్ని సాధించుకో.'
గురుదేవుల మాటలకు రామశాస్త్రి ఎంతో సంతోషించి కళ్ళ నీళ్ళ పర్యంతమై పాదాభివందనం చేశాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|