|
|
Articles: TP Features | 'టి' ఎందుకు ఇస్తుందంటే.. - Site Administrator
| |
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో కేంద్రాన్ని ప్రతి ఎన్నికల ముందు దడిపించే తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు బలంగా ఉండకూడదు. సర్వం నేనే అనే వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా ఏకపక్షంగా వెళ్ళే నాయకుడూ ఉండకూడదు. కులం పేరుతో రాష్ట్రంలో పార్టీలన్నీ ఏకమై కేంద్రాన్ని బెదిరించే పరిస్థితి రాకూడదు. గాలి జనార్దన్ రెడ్డి, జగన్ రెడ్డి లాంటి వారు కోట్లకు పడగలెత్తి రాజకీయాలను శాసించకూడదు. రాష్ట్రాల్లో పాలక కులాలుగా ఎదిగిన రెడ్డి, కమ్మ, వెలమ కులాలు మరింత స్ధిరపడి కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాకూడదు. రాష్ట్రాలు ఎప్పుడూ కేంద్రానికి విధేయంగా, ఆధారపడి మాత్రమే ఉండాలి. ఇలాంటి అనేకానేక ఆలోచనల వల్ల కేంద్రం బహుశా తెలంగాణకు సై అనే అవకాశం ఉంది. అంతేకానీ విద్యార్థులు ఉద్యమిస్తున్నారని, కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు, ఉపవాస దీక్షలు చేస్తున్నారని కేంద్రం తెలంగాణా ఇవ్వదు.
ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాంక్ష ఉంది. ఉద్యమిస్తున్నారు. నిజమే కాని ఈ ఉద్యమాల వల్ల కేంద్రం బెదరదు. ఎందుకంటే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఉన్నంత బలంగా వారిలో ఐక్యత ఉండదు. ఉద్యమాన్ని మేనేజ్ చేయలేరు. కానీ కొందరు ఉద్యమ నాయకులను కొంతవరకు మేనేజ్ చేస్తారు. అందుకే ప్రజా ఉద్యమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జడిసి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి సాధారణంగా ఉండదు.
ఐదున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమం, మూడు దశాబ్దాల నక్సల్స్ ఉద్యమం, దశాబ్దం పైగా సాగిన ఎస్.సి.రిజర్వేషన్ల పోరాటం, సారా ఉద్యమం, భూమి కోసం గిరిజనులు చేసిన, చేస్తున్న ఉద్యమాలు, ఉనికి కోసం, కనీస హక్కుల కోసం సాగుతున్న అస్తిత్వ ఉద్యమాలు పై విషయాలనే ధృవీకరిస్తున్నాయి. పైగా ఇలాంటి ఉద్యమాలను రాజ్యం తన ప్రయోజనం నెరవేర్చుకోవడానికి వీలుగా మలుచుకునే సందర్భాలు, సంఘటనలు కూడా గమనించవచ్చు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|