|
|
Articles: TP Features | అమ్మో... మనిషి! - Site Administrator
| |
(కొడుకుల శ్రీనివాస్)
ఈ అనంత విశ్వంలో సమస్త జీవరాశుల సృష్టికర్త అయిన ఆ స్థితి లయకారుడు ఒక్క మానవ జాతికే విచక్షణ జ్ఞానం, ఆలోచించే శక్తి, అపూర్వ మేథా సంపత్తిని ప్రసాదించాడు. ఈ విశేష శక్తుల పరిజ్ఞానంతో మానవుడు మహనీయుడు కావాలని ఆ దేవదేవుని సంకల్పం. కాని దురదృష్టవశాత్తు మానవుడు నేడు మహా నీచునిగా తయారై మనిషిని చూసి సగటు మనిషే 'అమ్మో... మనిషి' అని భయభ్రాంతులకు గురై పరుగులు తీసే దౌర్భాగ్య పరిస్థితులు సమాజంలో సృష్టిస్తున్నాజు. ఇందుకోసమేనా నేను ఈ మానవుడికి ఇన్ని అద్భుత శక్తులు ప్రసాదించానని ఆ దేవదేవుడు కుమిలిపోయేలా చేస్తున్నాడు.
మనిషిపై మనిషే ఆధిపత్యం చెలాయించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను కనిపెట్టాడు. దురదృష్టవశాత్తూ ఒక్క దండోపాయం అనే హింసా ప్రవృత్తినే ఏకైక మార్గంగా మనిషి ఎంచుకున్నాడు. దానితో తుచ్ఛమైన ధనం కోసం, క్షణికమైన శారీరక ఆనందం కోసం సగటు నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా హరిస్తూ నరుడు కాస్తా నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. ఈ ఘోర అకృత్యానికి పరాకాష్టగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సాక్షిగా నాగ వైష్ణవి అనే పదకొండేళ్ళ పసిమొగ్గను మాడ్చి మసి చేశారు మనిషి రూపంలో ఉన్న మృగాలు. వీళ్ళని తమతో పోల్చినందుకు ఆ మృగాలు సైతం సిగ్గుపడి అభ్యంతరం చెబుతాయేమో!
కీర్తి కోసం, కనకం కోసం ఎందరో కిరాతకులుగా మారి ఎన్నో అకృత్యాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు చేశారు. కాని పాలుగారే పసిబుగ్గల అందాల బొమ్మ వైష్ణవిని బాయిలర్ లో వేసి వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇనుపకమ్మెని కాల్చివేసినట్లు కాల్చివేసే దుర్ఘటన ఇంతవరకూ జరిగి ఉండకపోవచ్చు. అందుకే వైష్ణవి మరణం వాళ్ళ కుటుంబ సభ్యులనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనసున్న మనుషులందరినీ కలచివేసింది. వరసకి మేనమామలైన ఈ దుర్మార్గులు అప్పుడే పుట్టిన పసిబిడ్డలను కత్తికి ఎరవేసిన రాక్షసరాజు 'కంసుని' కంట కూడా కన్నీరు వచ్చేలా, అతి నీచంగా, కిరాతంగా ప్రవర్తించారు. కీకారణ్యంలోని పాములు, పులులు కూడా ఇతర క్రూరమృగాలు కూడా అయ్యో పాపం... వైష్ణవి అని జాలిపడేలా ఈ జనారణ్యంలోని మానవ మృగాలు మృత్యుహేల సాగించారు. మరణ మృదంగాలు మోగించారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|