|
|
Articles: TP Features | ధృతరాష్ట్రుని ఆత్మలు! - Site Administrator
| |
(హరనాథ్ బాబు)
భారత రాజకీయాలను ధృతరాష్ట్ర జాడ్యం పట్టి కుదిపేస్తున్నట్లు ఉన్నది. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు అధికారాన్ని అందివ్వడానికి అంధుడైన ధృతరాష్ట్రుడు అర్హతలు ఉండీ, సమర్ధులైన పాండవులకు అన్యాయం చేసుకుంటూపోయాడు. మహాభారత కథలోని హస్తినాపుర చక్రవర్తి అయిన అంధుడు ధృతరాష్ట్రుడు ఈ 21వ శతాబ్దంలో అనేక అవతారాలు ఎత్తాడు. రాజకీయ పార్టీలను నిర్మించిన, తెలివైన రాజకీయ నాయకుల్లోకి ధృతరాష్ట్రుని ఆత్మ ప్రవేశించింది. తమ కుమారుల రాజకీయ భవిత విషయానికి వచ్చేసరికి వారి తెలివి గాలికి పోయిన పేలాల చందం అవుతున్నది.
సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) నుంచి బహిష్కృతుడైన నేత అమర్ సింగ్ ఆ పార్టీకి పట్టిన దుర్గతి గురించి, తన ఇక్కట్ల గురించి వివరంగా తెలియజేసినప్పుడు ఈ జాడ్యానికి మరొక రాజకీయ 'అన్యుడు' బాధితుడైనట్లు స్పష్టమైంది. అంధుడైన తండ్రి (ములాయం) తన వారసుల గురించి పార్టీలో సమర్థవంతంగా పనిచేసే తన కుడిభుజాన్ని (అమర్ సింగ్) దూరం చేసుకున్నారు. ఆయన తన కుమారుని పీఠం ఎక్కించాలనే మొండి పట్టుదలతో స్వనాశనానికి కూడా సిద్ధపడ్డారు. తన రాజకీయ ఘనతలను, చరిత్రను ధ్వంసం చేసుకున్నారు.
పార్టీ నుంచి తన నిష్క్రణకు ప్రధాన కారణం పార్టీ కుటుంబ రాజ్యంగా మారిపోవడమేనని అమర్ సింగ్ చెప్పారు. కింది స్థాయి నుంచి వృద్ధిలోకి వచ్చిన నేత, ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో సమరశీలిగా పేరుగాంచిన, కాంగ్రెస్ ఆనువంశిక రాజకీయాలను నిశితంగా విమర్శించిన ములాయం సింగ్ యాదవ్, తన సొంత అధికార యాదవ్ వంశాన్ని సృష్టించుకోవడమే కాకుండా రాజకీయంగా వివేకవంతమైన పని అయినా, కాకపోయినా తన కుమారుడు అఖిలేష్ తన రాజకీయ వారసుడు కావడానికి ఎవరూ అడ్డు రాకుండా జాగ్రత్తపడ్డారు. రాజకీయంగా పనులు చక్కబెట్టగల మనిషిగా ముద్రపడిన అమర్ సింగ్ సమర్థుడు, పార్టీలో ఇంగ్లీష్ మాట్లాడగల నాయకుడు. యుపిలో కులాలు, వర్గాలు, మతాల మధ్య వారధి కావలసిన అవసరాన్ని తీర్చగల నాయకుడు ఆయన.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|