|
|
Articles: TP Features | ధృతరాష్ట్రుని ఆత్మలు! - Site Administrator
| |
అయితే, వీటన్నిటినీ మించి జటిలమైన వ్యవహారం భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్ సి)ది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆవిర్భవించిన కాంగ్రెస్ స్వాతంత్ర్యానంతరం నవజాత ప్రజాస్వామ్యానికి గుండెచప్పుడుగా మారి, అధికారాన్ని ప్రజల చెంతకు తీసుకువస్తుందని ఆశించారు. కాని గత కొన్ని దశాబ్దాలలో కాంగ్రెస్ నాయకత్వం 'ఖాస్ ఆద్మీ'కి గుత్త అయిపోయింది. అంటే ప్రత్యేక అధికారాలు, హక్కులు ఉన్న రాజకీయ కుటుంబాలకు గుత్త వ్యవహారంగా మారింది.
భారతదేశాన్ని ఆనువంశిక ప్రజాస్వామ్యంగా మార్చే ప్రక్రియ ఇందిరా గాంధితో మొదలైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పగ్గాలను తన కుమారుడు సంజయ్ కు అప్పగించాలని 1975లో ఆమె తీసుకున్న నిర్ణయం ఎమర్జన్సీ విధింపునకు దారి తీయడమే కాకుండా కుటుంబ పాలనను వ్యవస్థీకృతం చేసింది. సోనియా గాంధి ఉత్థానంతోను, పార్టీని సంఘటితం చేయడంలో ఆమె విజయంతోను కాంగ్రెస్ ఒక కుటుంబ అజమాయిషీలోనే చక్కగా నడుస్తుందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది.
అధికార సమీకరణలను మార్చాలని, ప్రతిభావంతులైన కొత్తవారికి కాంగ్రెస్ లో 'అవకాశాలు' కల్పించాలని తాను అభిలషిస్తున్నట్లు రాహుల్ గాంధి చెప్పుకున్నారు. కాని పార్టీలో తదుపరి శ్రేణి నాయకులుగా ఆవిర్భవించిన 'యువ' ఎంపీలలో అత్యధిక సంఖ్యాకులు ప్రముఖ కాంగ్రెస్ వాదుల కుమారులు, కుమార్తెలు. రాజకీయ రక్తాంకురాలతో రాజకీయ వారసత్వాలకు మేలు జరగదనేది కాంగ్రెస్ వాదులు గుర్తెరగాలి.
మన భూస్వామ్య సంప్రదాయం ప్రతిభపైన ఆధిపత్యం సంపాదించినట్లున్నది. ద్యూత క్రీడ సమయంలో 'గుడ్డి' ధృతరాష్ట్రుడు మౌనం వహించాడు. ఆ ద్యూత క్రీడ వల్ల పాండవులు తమ రాజ్యం కోల్పోయారు. తన సంతానాన్ని కట్టడి చేయవలసిన నైతిక బాధ్యత తనపై ఉన్నప్పటికీ సభికులందరి ముందు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కూడా ధృతరాష్ట్రుడు మౌనం వహించాడు. స్వపుత్రునిపై ప్రేమాభిమానాల విషయం వచ్చేసరికి రాజుగా బాధ్యతలు హరించుకుపోతాయనడానికి నిదర్శనంగా ధృతరాష్ట్రుని ఆత్మ ఇంకా సంచరిస్తున్నట్లున్నది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|