కరీంనగర్ : బస్సు నడుపుతున్న డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్ మీదే కుప్పకూలి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో బస్సు నడుపుతున్న డ్రైవర్ గుండె పోటు రావడంతో ఒక్కసారిగా స్టీరింగ్ మీద తలవాల్చేశాడు. ఏమైందోనని ఆందోళన చెందిన ప్రయాణీకులు పరిశీలించి చూడగా అతను అప్పటికే మృతి చెందడంతో వారంతా విచారంలో మునిగిపోయారు. కాగా ప్రయాణీకులందురూ సురక్షితంగా ఉన్నారు.