కరువు బృందం పర్యటన
కరీంనగర్ : ప్రభుత్వం జిల్లాలోని 57 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించడంతో ఈ నెల 4న కరీంనగర్ జిల్లాలో కరవు సహాయక బృందం పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు సహాయక బృందంలోని సభ్యులు శ్రీనివాస్, ఓపిన్దోస్, రావణనందలు జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం శనిగరంలో ప్రాజెక్టు సందర్శించడంతో పాటు కరవు ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా సందర్శించనున్నారు. శనిగరం ఆయకట్ట, గగీలపూర్ ప్రాంతాల్లో పర్యటించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటారన్నారు. తోటపల్లి ప్రాంతం, పెద్ద చెరువు, నుస్తులాపూర్ ప్రాంతంలో కరువు సహాయక బృందం పర్యటించి వరదల వల్ల జరిగిన నష్టాన్ని రైతుల నుండి వివరాలు సేకరిస్తారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సాయంత్రం 6 గంటలకు బస చేసి 5వ తేదీన నిజామాబాద్ జిల్లాకు కరవు సహాయక నివేదిక అంచనాల బృందం వెళ్తుందని తెలిపారు.
News Posted: 3 November, 2009
|