Active Blogs | Popular Blogs | Recent Blogs పినాకిని నదీ తీరంలోని ఒక ప్రదేశములో కొన్ని ఎలుకలు స్థావరంగా చేసుకొని, చుట్టుపక్కల దొరికిన ఆహారధాన్యాలు తిని తిరుగుతూ వుండేవి. వాటిలో ఒక ఎలుక పిల్లకు హుషారు ఎక్కువ. ఎప్పుడూ ఆ పరిసరాల్లోనే తిరుగుతూ వున్నందున దానికి విసుగు పుట్టి... అలా... అలా తిరిగి ఏదైనా కొత్త ప్రాంతం చూడాలని, తోటి ఎలుకలు వారిస్తున్నా వినకుండా బయలుదేరింది.
కొత్త, కొత్త ప్రదేశాలను చూస్తూ, ఎంతో వుత్సాహంగా సాగిపొతూ వుంది. ఆ ఆనందంలో పరిసరాలను సైతం గమనించక పోవటముతో ఆహారము కోసము పొంచి యున్న ఒక పక్షి కంటిలో పడింది. తన కాళ్ళతో లటుక్కున ఎలుక పిల్లను పట్టేసింది పక్షి. ఉహించని పరిణామానికి బిత్తర పోయి కెవ్వున అరిచింది ఎలుకపిల్ల.
ఆ పైన తెప్పరిల్లి.. "అయ్యో..అయ్యో..!నన్ను వదిలేయ్.. నీకు పుణ్యం వుంటుంది..." అంది ఎలుకపిల్ల.
"పుణ్యం సంగతి దేవుడెరుగు..! రెండు రోజుల నుండి నేను ... నా పిల్లలు తిండి దొరక్క అల్లాడిపోతున్నాము. లడ్డులా దొరికావు నిన్నెలా వదలను.." అంది పక్షి.
అంతలో అక్కడకు పక్షి పిల్లలు ఎగురుతూ వచ్చాయి. వాటిని చూసిన పక్షి."ఇదిగో పిల్లలూ ..! మనకు మంచి ఆహారం దొరికింది. రండి... తిందురు గాని..." అని పిలిచింది.
"అమ్మా..పక్షి తల్లీ..! నాకు మరి కొంత కాలము బ్రతకాలని వుంది. దయ చేసి నన్ను వదలిపెట్టు..." ఎలుక పిల్ల దీనంగా ఏడుస్తూ ... పక్షిని బతిమలాడ సాగింది.
ఆ దృశ్యం చూసిన పక్షి పిల్లలకు " అయ్యో...!" అనిపించింది.
"పోనీలేమ్మా అది భయపడి ఏడుస్తూ వుంది... మరికొంత కాలం బ్రతకాలని ఆశ పడుతూ వుంది. పాపం వదిలి పెడదాము..." అన్నాయి పక్షి పిల్లలు.
"వదిలి పెడితే మనకు ఆహారము ఎలా..?" అడిగింది పక్షి .
"పిల్లలూ మీరైనా మీఅమ్మతో చెప్పి నన్ను వదిలి వేయరూ....! మీరూ ..నేనూ.. నేస్తాలుగా వుందాము.." అంది ఎలుకపిల్ల.
పక్షి పిల్లల మనసు కరిగింది. వాళ్ళమ్మను ఒప్పించి... ఎలుకపిల్లను విదిపించాయి. ఆ తర్వాత ఎలుక పిల్ల అక్కడే వుండిపొయింది. పక్షి పిల్లలతో చెలిమి చేసింది.
ఇలా వుండగా ఒక రోజున ఒక వేటగాడు వచ్చి పక్షుల కోసం వల పన్నాడు. అది తెలియని పక్షి పిల్లలు అందులో చిక్కుకు పోయాయి. తప్పించు కోలేక బిగ్గరగా అరవసాగాయి.
ఆ అరుపులు విన్న ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చి వలలోచిక్కుకుని వున్న తన నేస్తాలను చూసి, గబగబా పరుగెత్తుకొచ్చింది.
"నేస్తాలూ..భయపడకండి .." అని, ధైర్యం చెప్పి, గబ గబ తన పదునైన పళ్ళతో వల తాళ్ళను పట పట కొరికి వేసింది. పక్షి పిల్లలు క్షేమంగా బయట పడ్డాయి.
సాయంత్రం పక్షి ఇంటికి రాగానే విషయమంతా చెప్పి, "అమ్మా..! ఎలుకన్నతో చెలిమి చేయబట్టి మనకు ఎంతో మేలు జరిగింది. లేకపోతే ఈ పాటికి మా ప్రాణాలుపోయి వుండేవి.." అన్నాయి పక్షి పిల్లలు.
"నిజమే మరి.. !" అంది పక్షి.
తన పిల్లలను సమయానికి రక్షించిన ఎలుక పిల్లకు కృతజ్ఞతలు తెలిపినది. అప్పటి నుండి వాటి మధ్య చెలిమి మరింతగా బలపడింది.
 punna bhups | మత్తు మత్తుగా తెల్లవారుతోంది. కావ్య బద్ధకంగా ముసుగు తన్ని నిద్రపోతోంది. వాళ్ళ అమ్మ పద్మావతి మాత్రం బుజ్జగించి నిద్రలేపుతూనే ఉంది. కావ్య వాళ్ళ అమ్మను ముద్దుగా పద్దు అని పిలిస్తుంది.
"పద్దూ నిద్రపొనీవే కాసేపు, ఈ రోజు ఆదివారమే కదా" అంది కావ్య.
"నీకు బొత్తిగా బుద్ది లేకుండా పోతుంది. అందరు ఆడపిల్లలు ఇలానే ఉన్నారా? ఇలా అయితే ఎలాగే? నాన్నగారు పొద్దున్నే ఎదో పని మీద వెళ్ళిపోయారు" అంది అమ్మ.
"పద్దూ ఒక్క ఐదు నిముషాలే" అంటూ అమ్మ దగ్గరగా చేరి పడుకుంది.
వాళ్ళకు కావ్య ఒకత్తే కూతురు. కావ్య తండ్రి టీచరుగా పనిచేస్తున్నారు. ఇంట్లో కావ్య, అమ్మ, నాన్న, నానమ్మా ఉంటారు. కావ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
"కావ్యా! రాజమండ్రి నుండి ఫోన్ వచ్చింది" అని నానమ్మ అరుస్తోంది.
గబుక్
Posted at: 1, Sep 2010 10:25 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|