Active Blogs | Popular Blogs | Recent Blogs
పౌరాణిక చిత్రబ్రహ్మ
1936 లో ఒకే ఇతివృత్తంతో రెండు చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. తెలుగు టాకీల పితామహుడు హెచ్. యం. రెడ్డి గారి అల్లుడు హెచ్. వి. బాబు దర్శకత్వంలో ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' ఒకటి, ఎస్. జగన్నాథ్ దర్శకత్వంలో ' ద్రౌపదీ మానసంరక్షణ ' మరొకటి. బాబు కంటే జగన్నాథ్ సినిమా కళలో అప్పటికే నిష్ణాతుడు. కానీ ' ద్రౌపదీ వస్త్రాపరహణం ' బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించగా ' ద్రౌపదీ మానసంరక్షణ ' పరాజయం పాలైంది. అయితే జగన్నాథ్ చిత్రంలోనే దర్శకత్వ విలువలు పుష్కలంగా వున్నాయని అప్పటి ప్రముఖ పత్రిక ' కృష్ణాపత్రిక ' తన సమీక్షలో ప్రశసించింది. బాబు దర్శకత్వంలోని లోపాలు ఎత్తిచూపుతూ రాసిన ఆ సమీక్ష హెచ్. యం. రెడ్డి గారిని ఆకర్షించింది. వెంటనే ఆ సమీక్షకుడిని మద్రాస్ కు పిలిపించారు.
ఆ సమీక్షకుడు ఎవరో కాదు. తర్వాత కాలంలో భారత సినిమారంగానికి పౌరాణిక చిత్ర పథ నిర్దేశకుడిగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు.
....... ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|