|
|
Articles: My Thoughts | pArTIllO saMkshObhaM - Mr. ramulu ch
| |
తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వెళ్ళిన సందర్భంగా మామ అల్లుళ్ళు తనను ఏ విధంగా అవమానించారో తెలుపుతూ పలు అరోపణలు చేస్తే ఒక్క దానికీ ఎవ్వరూ సమాధానమే చెప్పలేదు.అట్లనే నల్లపురెడ్డి,రేణుకా చౌదరి బయటికెళ్ళినప్పుడు చేసిన ఆరోపణలకు కూడ తె.దే వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పనేలేదు.తనెవ్వరిని ముందుకుతెస్తే వారినే తన అభిమానులు, ప్రజలు తలకెత్తుకోవాలని ఎన్.టీ.ఆర్ భావించేవాడు.అధేవిధంగా తనను వెన్నుపోటు పొడిచినవాళ్ళను, అవినీతిపరుణ్ణి తొలగిస్తే రిసీవ్ చేసుకున్నట్టుగానే తనెవరిని (మంచివాళ్ళను) తొలగించినా ప్రజలు రిసీవ్ చేసుకోవాలన్నట్లుగా ఎన్.టీఆర్ భావించేవాడు. ఒక్క ఎన్టీఆరేకాదు, ఇందిరాగాంధీ కూడా తమను ప్రజలు గెలిపించారు కాబట్టి తామేది చేసినా ప్రజలు సమర్ధిస్తారనే భ్రమల్లో ఉండే వాళ్ళు. వారి తరువాత కూడా ఎందరో నాయకులు ఆయా పార్టీలలో అదే దారిలో నడిచారు.
ఇట్లాంటి అభిప్రాయాలను కలిగివున్న వాళ్ళంత పూర్తి స్థాయి నియంతలు కాకపోవచ్చు కాని వారివి నిస్సందేహంగా నియంత లక్షణాలే. అందుకే అటువంటివాళ్ళు కూడా ఓడిపోయారు, ప్రజలచేత పరాభవించబడ్డారు, సంక్షోభాలను ఎదుర్కొన్నారు. అందుచేత కొన్ని సందర్భాల్లో ఉన్నట్లంపించినా ఏ పార్టీలో కూడా ప్రజస్వామ్యం లేదు. అసలు స్వాతంత్ర్యమిచ్చినా, నాయకులు ప్రజాస్వామ్యంగా మసలుకున్నా అనుచరులు దాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలు కూడా చరిత్రలో మనకు ఎక్కువే కనిపిస్తాయి. ఇట్లాంటి విభేదాలే అంతిమంగా పార్టిలకు నష్టం కలిగిస్తాయి.
కొన్నిసార్లు అహేతుకమైన విభజనకు దారితీస్తుంటాయి. తెలుగుదేశం, తెరాసలో ఇప్పుడు కలుగుతున్న పరిణామాలు అటువంటివే. బాబు, కేసీఆర్లు ఇద్దరూ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుమతించలేదు.కొన్ని ప్రధాన విషయాల మీదనైనా కొన్నిసార్లు కొద్దిమందితో, కొన్నిసార్లు అనేక మందితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే అంతర్గత ప్రజాస్వామ్యం సజీవంగా ఉండేది. ఇది కొరవడినందుకే కొంతమంది మంచి నాయకులు కూడా తె.దే, తెరాసల నుండి కూడా ఎప్పటి నుండో బయటికి పోయినందుకే సంక్షోభాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సివస్తున్నది. మంచినాయకులను కూడా బయటికి పంపించిన ఫలితమే ఆ రెండు పార్టీల్లో సంక్షోభల రూపాల్లో మనకు కనిపిస్తున్నయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|