TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
నేటి రాజకీయాలు
- Mrs. mayavathi gurram
  Page: 1 of 1    
రాజకీయ నిరుద్యోగులు అందరూ కొత్త పార్టీలను పెడుతున్నారు, అంటే వీరికి సమాజాన్ని మెరుగు పరిచే ఆలోచనలు వున్నట్లు కనిపించదు. ఏపార్టీలో వుంటే ఆ పార్టీలో పదవులు రాకపోతే కొత్త పార్టీలకు వలస వెళుతున్నారు. కొత్తగా పార్టీలు పెట్టిన వారు కూడ రాజకీయ నిరుద్యోగులను చేరదీస్తున్నారు మరి. రాష్ట్ర విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకే పాపం పదవులు కదా అందుకే మిగిలిన వారు వలస వెళ్తున్నారు. వీళ్ళల్లో ఎవరికైనా సమాజానికి, ప్రజలకు కొంచెం అయిన సేవ చేస్తారా అంటే లేదనే చెప్పాలి. ఎవరి స్వార్థం వారిది మరి. టిడిపి విషయానికివస్తే వీళ్ళు కొత్తలో బానే చేస్తారు, కాని తొండ ముదిరి వూసరవెల్లి అయినట్లు తయారు అయ్యారు, పదవికోసం పోరాటం తప్పితే సమాజానికి సేవ చెయ్యాలనే ఆలోచన వీరికి లేదు. ఇంక టి.ఆర్.ఎస్. విషయానికి వస్తే ఏదో చేస్తాం, ఏదో సాధిస్తాం అని గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్ళారు, చివరికి ఏమయింది, తెలంగాణ కాదు కదా తమ వునికిని నిరూపించుకోవలసి వచ్చింది ఒక దశలో, ఈయన పదవులు లేక తెలంగాణ అనే కొత్త పదాన్ని వాడుకున్నాడు, ఈయన భాషలోనే చెప్పాలంటే జనాలు పిచ్చోళ్ళు, గొర్రె దాటుడు రకం అదే ఆయనకు మేలు చేసింది ఏమిటీ అంటే తనకు మాత్రం పదవులు వచ్చాయి, అది చాలు కదా వీళ్లకు. చివరిగా ప్రజారాజ్యం విషయానికి వస్తే ఈయన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏదో మేలు చేస్తాడని ప్రజలు ఆశ పడుతున్నారు. కొత్త ఆలోచనలతో, కొత్త వ్యక్తులతో, కొత్త సమాజాన్ని నిర్మిస్తారని కలలు కంటున్నారు. కాని తీరా చూస్తే రాజకీయ నిరుద్యోగులను చేరదీస్తున్నాడు. నిజం చెప్పాలంటే సమాజ సేవ చేయడానికి పదవులు అవసరం లేదు, మంచి ఆలోచనలు, వీటిని అమలు పరిచే నాయకులు వుంటే చాలు, నాయకుడు అనే వాడు మంచి ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవాలి, వీరిలో ఆలోచనను రేకెత్తించాలి, అంతే కాని ఎన్నికల ముందు రోడ్ షోలను చెయ్యడం కాదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నరజాతి సమస్తానం పరిదిన ప్రయాణం అనేవాడు శ్రీశ్రీ, అలా తయారయింది మన సమాజం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు వొరిగేది ఏమీ లేదు, ప్రజలకు శాశ్వతమైన పరిష్కారం కావాలి, ఒక పూట అన్నం పెడితే వాడికి ఆపూటే ఆకలి తీరుతుంది, కాని రేపటికి మళ్ళీ పొట్ట చేతిలో వుంటుంది, కాబట్టి పేదవాడికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపెట్టాలి. బీదవాడు కూడా రేపటి పరమాణ్ణం కోసం చూడడం లేదు, ఈ రోజు పచ్చడి మెతుకులు చాలు అనుకుంటున్నాడు, ఈ అవసరమే రాజీకయ నాయకులకు మంచి అవకాశం అయింది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తిరిగి వారిని అందలం ఎక్కించగల అవకాశం అదే. చివరగా సమాజం పైన ప్రతి వ్యక్తి ప్రాభవం వుంటుంది, కనుక ఈ రాజకీయ పార్టీలు శాశ్వతమైన పరిష్కారాన్ని ఆలోచించాలి, కేవలం పదవుల కోసం పార్టీలను పెట్టడం చెయ్యకూడదు, ప్రజల కోసం ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం, పేదవాడికి మేము ఉన్నాం అనే ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎజెండాను తయారు చేసుకోవాలి. అప్పుడే నవ సమాజ నిర్మాణం అవుతుంది, ప్రతి ఒక్కరిలోనూ ఆనందం వెల్లి విరుస్తుంది.

Read 2 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.