TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
శేషేంద్ర వారసులెవరు?
- Mr. Sarma Guntur Satyaki
  Page: 1 of 4   Next > >  
కవిగా, విద్వద్విమర్శకునిగా వాసికెక్కిన సాహితీమూర్తి మా నాన్న గుంటూరు శేషేంద్రశర్మ 2007 మే 30న మరణించిన విషయం సాహితీ జగత్తుకు తెలిసిందే. మృతి చెందిన రోజు నుంచీ, ఆయన గురించి వెలువడుతున్న వార్తల్లో, వ్యాసాల్లో ఆయన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తదితర వాస్తవాల ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. పైగా, అవాస్తవాలు, అభూతకల్పనలు ఒక పద్ధతి ప్రకారం, ధనబలంతో ప్రచారం జరుగుతున్నాయి. కన్నకొడుకునైన నాకు ఈ విషయం తీరని మనస్తాపాన్ని కలిగిస్తోంది. అందుకే, ఈ సభ్య సమాజానికి వివరణ ద్వారా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని మౌలిక సత్యాలు వెల్లడిస్తున్నాను. శేషేంద్రశర్మ కుటుంబ సభ్యులు : తల్లిదండ్రులు - సుబ్రహ్మణ్యం శర్మ, అమ్మాయమ్మ. శ్రీమతి జానకి - భార్య, శ్రీమతి వసుంధర, శ్రీమతి రేవతి - కుమార్తెలు, వనమాలి, సాత్యకి- కుమారులు. వీరు మాత్రమే ఆయనకు చట్టబద్ధమైన వారసులు. సామాజికంగా, నైతికంగా కూడా శేషేంద్ర వారసులు వీరే. వీధి నాటకం : 1971లో రెండవపెళ్లి పేరుతో, సభ్యసమాజానికి దూరంగా, తననెరిగిన వారికి తెలియకుండా కర్ణాటకలోని మారుమూల ప్రాంతంలో ఒక వీధి నాటకం జరిగినప్పటికీ, ఆ తరువాత దశలో మా అమ్మ శ్రీమతి జానకికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు. ఈ హళేబీడు సర్కసు ముందుకు కూడా అలాంటి అపచారానికి, అకృత్యానికీ ఆయన పాల్పడలేదు. పైగా కాలానుగుణంగా, ఎప్పటికప్పుడు మా అమ్మనే తన వారసురాలిగా కీలకపత్రాల్లో ధృవీకరిస్తూ వచ్చారు. ఈయన 37 ఏళ్ళ ప్రభుత్వ నౌకరీ చరిత్రలో అనూహ్యంగా మూడుసార్లు రిటైరయ్యారు. మొదటిసారి 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో, రెండవసారి స్వర్గీయ ఎన్.టి.రామారావు సేవా వయో పరిమితిని 1983లో 55 ఏళ్ళకు తగ్గించినప్పుడు, చివరిగా 1985లో 58 ఏళ్ళ వయస్సు పూర్తికావడంతో - ఈ మూడు సార్లు కూడా ప్రభుత్వ పత్రాల్లో శ్రీమతి జానకి పేరునే తన వారసురాలిగా ధృవపరిచారు. 2002లో తాజాగా వెలువడిన సర్కారు నియమనిబంధనల మేరకు మళ్ళీ ఇచ్చిన వారసత్వ పత్రాల్లో కూడా మా అమ్మనే వారసురాలిగా పేర్కొన్నారు. కనుకనే పరస్పర విరుద్ధమైన ద్వితీయ వివాహం చట్టవిరుద్ధమైన నేరం. సాహిత్యంలో లక్ష్మీపార్వతి : 1995లో స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలకు ముందే వివాహబంధం వేసుకున్న శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి రాజకీయాల్లో ఒక ఏణ్ణర్థం పాటు ప్రముఖస్థానంలో ఉన్నారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న అనుచరుల బృందం ఒకటి ఉండేది. రామారావు పదవి నుంచి తొలగిన క్షణాన్నే చాలామంది ఆ బృందంలోంచి బయటికొచ్చేశారు. మిగిలిన ఒకటీ, అరా ఎన్టీఆర్ స్వర్గస్థులైన మరుక్షణమే అంతర్ధానమైపోయారు. సాహిత్యసంఘంలో ఇందిరా ధనరాజ్ గిర్ కూడా ఇదే పాత్రను దాదాపు 36 ఏళ్లు పరమ హేయమైన ధోరణిలో పోషించింది. నాన్నకు ఆత్మీయులను, కేవలం సాహిత్యం మీద ఆదరాభిమానాలతో ఆయనను కలుసుకునే అభిమానులను పద్ధతి ప్రకారం దూరం చేసింది. తంగిరాల సుబ్బారావు, వెలిచాల డొంకలరావు తదితరులను తన అనుచర బృందంగా రూపొందించుకుంది. ఈ బృందంలో 30 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు కొత్త నీరొచ్చి చేరుతోంది, పాతనీరు తెరమరుగవుతోంది.

Be first to comment on this Article!

  Page: 1 of 4   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.