TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
మయుడు
- Miss rajeswari rajeswarinedunuri
  Page: 1 of 2   Next > >  
పూర్వ యుగాల్లో అప్పటి ఆయుర్దాయం ప్రకారం కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వరాలు పొందేవారు. అలా వరాలు పొందిన వారెవ్వరూ వర గర్వంతో అంతిమంగా విజయాన్ని పొందలేక పోయారు. నిర్మల భక్తి తో దైవాన్ని కొలిచి ఆరాధించిన వారికి కోర కుండానే భగవంతుడు వరాలను ప్రసాదిస్తాడు. మహిషాసురుడు, భస్మాసురుడు, హిరణ్య కశిపుడు, త్రిపురాసురులు, ఎందరో వర లబ్ధి పొందినా వర సిద్ధిని పొంద లేక పోయారు. అందుక్కారణం, వారి అసుర తత్వం. ఆ కోవకు చెందిన వాడే ఈ మయుడు. 'సముచి' అనే రాక్షసునికి సోదరుడు మయుడు. దేవతలకు విశ్వకర్మ లాగ రాక్షసులకు మయుడు అద్భుత భవన నిర్మాణానికి సృష్టి కర్త. ఇతడు గొప్ప శిల్పి. తన శక్తి సామర్ధ్యాలతో ఎన్నో అద్భుత భవనాలను, ఆయుధాలను, పరికరాలను నిర్మించాడు. ఐతె కొన్ని చోట్ల మయుడు - విశ్వ కర్మ ఒకరే అని వివరించ బడింది. ఈ మయుడు అనే రాక్షసుడు ఆకాశంలో తేలే మూడు ఆద్భుత భవనాలను నిర్మించాడు. ఈ నిర్మాణం గురించి మత్స్య పురాణంలో 128 అధ్యా యంలో వివరించ బడింది. బ్రహ్మ దేవుని గురించి విశ్వకర్మ ఐన మయుడు అతడిని అనుసరించి విద్యున్మాలి, తారకాక్షుడు అనే రాక్షసులు కూడా తపస్సు చేయ సాగారు. వారి తపస్సును మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షమై నప్పుడు, 'తమకి మరణం లేకుండా' వర మీయమని అడిగారు. అందుకు బ్రహ్మ అలా వీలు పడదు. మరణం ఎవరి కైన సహజమే అని మరేదైనా కోరుకో మన్నాడు. అప్పుడు 'తాము మూడు దివ్య దుర్గాలను నిర్మించ దలచు కున్నామనీ అవి ఎటువంటి అగ్నికీ జలానికీ, దేవతల ఆయుధాలకీ నాశనం కాకుండా ఉండేలా వరమీయమని అడిగారు. అందుకు బ్రహ్మ చిరు నవ్వు నవ్వి మరొక సారి దుర్మార్గులకు సర్వదా అమరత్వం సాధ్యం కాదని హెచ్చరించి భవన నిర్మాణానికి వరమిచ్చాడు. అందుకు మయుడు బ్రహ్మ మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించి 'తాము నిర్మించే మూడు నగరాలు ఒకే ఒక్క బాణంతో నాశనం కావాలని, ఆ బాణమే, మయ, విద్యున్మాలి, తారకుల ప్రాణాలు తీయడానికి వీలు కలిగేలా, వరమీయమని మరీ మరీ కోరారు' అందుకు బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధాన మయ్యాడు. ఐతే మయుడు ఇలా కోరడం వెనుక ఒక అంతరార్ధం ఉందట. అదెలా అంటే తాను నిర్మించ బోయే భవనాలకు మధ్య వంద యోజనాల దూరం ఉంచి ఎందుకంటే ఒక బాణం వంద యోజనాల దూరం ప్రయాణిస్తే తప్ప మూడు పురాలు దగ్గర కావు అవి నిరంతరం గాలిలో తేలుతూ తిరుగుతూ ఓకే వరుసలో ఎప్పుడు ఉండవు గనుక వాటిని మూడిటినీ ఒకే బాణంతో నాశనం చేయ లేరు. కావున అందులో ఉండే రాక్షసులకు ప్రాణ భయం ఉండదని తమకు మరణం లేదని మయుడు ఆలోచించి అదే ఆలోచన తో దుర్గ నిర్మాణం ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా నిర్మాణం జరిగి పోయింది. ప్రతి పురము పొడవు వెడల్పు నూరు యోజనాలు ఉండేలాగ పుష్ప యోగంతో వాటిని నిర్మించాడు. ఎందు కంటే ఆ యోగం తెలిసి గాలిలో ఎగిరి రాగల వారు మాత్రమే తమ పురాలను సమీ పించ గలరని మయుని నమ్మకం. అందు వలన మహా ద్వారాల తోను, మేరు మంధర సదృస్య మహా ప్రాకారాలతోను విరాజిల్లే మూడు నగరాలు ఒకే తీరుగా నిర్మిం చాడు.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 2   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.