TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
కృష్ణమ్మ కలపదా ఇద్దరినీ!
- Site Administrator
  Page: 1 of 2   Next > >  
(ఊర్మిళ) రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఒక వైపు సాగుతుండగా, ఒక పరిష్కార మార్గాన్ని కొందరు సీనియర్ రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ఈ పరిష్కార మార్గం మంచిదే గాని అసలు ఎన్నటికీ వాస్తవ రూపం దాల్చదు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, తెలంగాణ ఒక రాష్ట్రంగా విలీనం కావచ్చునని వారు సూచిస్తున్నారు. ఇవి ఏళ్ళ తరబడి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వెనుకబడడమే కాకుండా, చివరకు కృష్ణానది వంటి వనరులను కూడా పంచుకుంటున్నాయని వారంటున్నారు. అయితే, గడచిన 50 సంవత్సరాల రాష్ట్ర రాజకీయాలు ఈ విలీనాన్ని అసాధ్యం చేస్తున్నాయని వారు అంగీకరిస్తుండడం గమనార్హం. వారు ఈ సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకువస్తున్నారనేది ముందుగా అర్థం చేసుకోవలసి ఉంది. రాయలసీమకు చెందినవారు తాము సాంస్కృతికంగా తెలంగాణ వాసులకు సన్నిహితులమని చెబుతున్నారు. 'అంతేకాదు. కృష్ణానది రెండు ప్రాంతాల గుండా ప్రవహిస్తున్నది. అందువల్ల ఈ నదీ జలాలను పంచుకోవడమన్నది వివాదాస్పదం కాబోదు' అని అనంతపురానికి చెందిన మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. చంద్రశేఖర్ రాయలసీమ ఎప్పుడూ ఎలా దాహంతో పరితపిస్తున్నదో వివరిస్తూ చెప్పారు. భౌగోళిక సాన్నిహిత్యం కూడా ఈ రెండు ప్రాంతాలు విలీనం కావడానికి అవకాశం కల్పిస్తున్నది. రెండు ప్రాంతాలను పక్కకు పెడుతున్నారని (రెండు ప్రాంతాల రచయితలకు కావలసినంత గౌరవం దక్కడం లేదని), ఒకే విధమైన నేపథ్యం ఉన్న ప్రాంతాల ప్రజలు సహజంగానే పరస్పరం కలసిపోతారనే వాదం వల్ల కూడా వీటిని విలీనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని అంటున్నారు. ఆంధ్ర ప్రాంతంతో విలీనాన్ని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలవారు గట్టిగా వ్యతిరేకిస్తారు. 1956లో ఆంధ్రలో విలీనాన్ని తెలంగాణ నిరసించగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర ప్రాంతంతో కలసి తమను విడదీస్తున్నప్పుడు రాయలసీమలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అభివృద్ధి చెందని రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణకై సీమవాసులు వాగ్దానాలు, ఒప్పందాలు కోరారు కూడా. మరీ ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంవారంటే ఒకేవిధమైన ఛీత్కార భావం ఉంది. ఉభయులకూ ఆంధ్ర ఉమ్మడి శత్రువని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్ర కారణంగా తెలంగాణకు కృష్ణా జలాలు లభించడం లేదని, రాయలసీమలో వాగ్దానం మేరకు అభివృద్ధి జరగలేదని వారు పేర్కొన్నారు. 1936లో ఆంధ్ర, రాయలసీమ నాయకులు సంతకాలు చేసిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం, చేసిన చాలా వాగ్దానాలలో ఒకటి అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నది. కాని దానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు.

Be first to comment on this Article!

  Page: 1 of 2   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.