TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
తెలుగా, ఆంధ్రమా!
- Site Administrator
  Page: 1 of 1    
తొలి కవి నన్నెచోడుడు (క్రీ.త.10-12- నూరేళ్ళు) 'మును మార్గకవిత లోకం బున వెలయగ దేశి కవిత పుట్టించి తెనుం గు నిలిపిరంద్ర విషయమున జన సత్యాశ్రయుని దొట్టి చాళుక్య నృపుల్' అంటూ నన్నెచోడుడు కీ.త. 10-దో నూరేడుకు ముందు తెలుగులో రచనలు సాగలేదు, సంస్కృతము ప్రాకృతముల లోనే రచనలు (మార్గ కవిత) సాగుతూ ఉండినాయి అని తెలుపుతున్నాడు. అలాటి పరిమట్టులలో కొత్త పుంతలు తొక్కి సత్యాశ్రయుడు, అతని తరువాతి చాళుక్య రాజులు తెలుగులో రచనలు (దేశి కవిత) చెయ్యించినారు అని, తెనుంగును ఆంద్ర విషయములో నిలిపినారు అని కూడా నన్నెచోడుడు రాస్తున్నాడు. 'తెనుంగు నిలిపిరి' అనే మాటలో ఆ నాడు తెలుగుకు కలిగి ఉండిన ముప్పును, దానిని గురించి నన్నెచోడుడు పడిన బాదను మనము తెల్లము చేసుకోవాలి. మార్గ కవిత, అనగా సంస్కృత కవిత ఆంద్ర విషయములో (తెలుగు నాటి మొత్తము అని అనుకోకూడదు) దేశి కవితను (తెలుగు నానుడి) చంపి ఏసేటి అంత వరకు ఒచ్చింది అని, సత్యాశ్రయుడు మొదలు అయిన చాళుక్య రాజులే కనుక పూనుకోకపోతే, వారికి ఆ మంచి బుద్ధి పుట్టి ఉండకపోతే తెలుగు చచ్చిపోయి ఉండేది అని కవి వాపోతూ ఉన్నాడు. ఇంకా, మార్గ కవితను తొలగించి దేశి కవితను పుట్టించడము అంటే తెలుగును నిలపడము లేక కాపాడడము లేక బతికించడమే అని రచయిత తన అనిపింపును తెలుపుతున్నాడు. అంటే మార్గకవిత సంకల్పము తెలుగును చంపడమే అని తేటగా తెలియడము లేదా? ఇంతకన్నా గోరము నేరము వేరే కలదా? ఆ నాటి నుండి తెనుంగు నుడి పరంగా వాడబడింది. అంద్ర (ఆంద్ర కాదు) ఒక విషయము లేక మండల పరంగా వాడబడింది. అయినా నేడు దానిని నాటి పరంగా జాతి పరంగా తుదకు నుడి పరంగా కూడా వాడడానికి కూడా ముందుకు ఉరుకుతున్నారు పెద్దలు. తొలిగా దేశి రచన జరిగిన ఈ సీమను చాళుక్య చెక్కింపులలో ఎక్కువగా వేంగీ రాజ్జెము అనే పిలిచినారు. దానిలోని విషయాలు ఎక్కువగా గుద్దవాడి, పల్లపు గుద్దవార, రెండు ఏరుల నడిమి, అత్తిలి నాండు, ప్రోలు నాండు అంటూ ఉన్నాయి. కాని ఆంద్ర విషయము అంటూ లేదు. కాని నానుడిలో అన్ని మాటలను విడిచిపెట్టి, ఈ ఆంద్ర అనే మాటను ఎక్కువగా రాసి, విరివి చెందించిన వారు ఎవరు అయినా తెలుగుకు విరోదులే, తెలుగు జాతికి నీతికి కీడు చేసిన వారే. నన్నెచోడుడు అంతతో పోనియ్యలేదు. తాను ఏ పలుకులో రాస్తున్నాడో కూడా తేటగా చెప్పుతున్నాడు. 'సరళము గాగ బావములు జాను దెనుంగున నింపు' పెంపుతో బిరిగొన వర్ణనల్ పణితి పేర్కొన నర్దము లొత్తగిల్ల... అంటూ తాను జాను తెనుంగులో రాస్తున్నాను అని కచ్చితంగా తెలుపుతున్నాడు. నన్నెచోడుడు ఆనిడించి తెలుగులో కవిత రాసిన తొలి కవి. ఇతని కబ్బము మవులికము. ఇతనిని అనువాద యుగములో చేర్చిన అందుకు ఒక వివరణ. సత్యాశ్రయమునకు ముందు మార్గ కవిత సంస్కృతములో రాయబడుతూ ఉండేది అని మనము చూచినాము. కాని దేశి కవిత పుట్టించి తెనుంగు నిలపడము అనే సత్యాశ్రయుని వయికరి వలన తెలుగు నానుడి రంగములో రెండు పోకడలు పుట్టి రెండు ఆనువాయితీలుగా పెంపొందినాయి. మవులిక పోకడ : రాజ ఆదరణచే లబించిన ఈ అనువును ఆనుగా తీసుకొని తెనుగుల కొరకు, తెనుగుల గురించి తెలుగు నాటిని గురించి, తెలుగులో, తెలుగు నానుడి ఆనువాయితీలలో ఆనిడించి మవులిక రచనలు చెయ్యడము మొదటిది. ఈ ఆనువాయితీకి నన్నెచోడుడు మూల కవి, ఆది కవి. ఆ తరువాత ఒచ్చినవారు పాల్కురికి సోమనాదుడు, బద్దెన, వల్లబరాయుడు, క్రిష్ణదేవరాయలు, పింగళి సూరన వగయిరాలు. అనువాద పోకడ : రాజ ఆదరణ పొయ్యింది కనుక, మారిన పరిమట్టులకు అనుకూలంగా తాళము ఏస్తూ దేశి కవిత అంటూనే, తెలుగులో రాస్తున్నాము అంటూనే తిరిగి మార్గ కవితను, సంస్కృతాన్ని తెలుగు రాతల (letters)లో రాసి నానుడి రంగములో, దాని గుండా నాటిలో జారిపోయిన పెత్తనాన్ని నిలుపుకోడానికి ఎతినించిన అట్టి సంస్కృతీయుల ఆనువాయితీ రెండోది. దీనిని ఆ కాలపు రచయితలు సంస్కృత పొత్తాలను తెలుగులోకి అనువదించడము గుండా, తెలుగులోకి అడ్డు ఆపు లేకుండా సంస్కృత మాటలను దిగుమతి చేసి తెలుగు లిపిలో రాయడము గుండా సాగించినారు. ఈ కదిలింపు (movements)కు నన్నయ తొలి మనిసి. అందుకే నన్నయను ఆది అనువాదకుడు అన్నాము. ఆ తరవాత వచ్చిన వారు తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాదుడు వగయిరాలు.

Be first to comment on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.