|
|
Articles: My Thoughts | ఎన్నికల వేళ కాలుష్యం - Dr. Srinivasa Rao Duggaraju
| |
ఎన్నికల ప్రచారం అవగానే ముందుగా మొదలవుతాయి గోడలమీద రాతలు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చవకబారు రంగులతో తమ తమతమ నినాదాలు రాస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా రాసుకుంటూ పోయి పరిసరాలను ఛండాలంగా తయారు చేస్తారు. ప్రచారం కోసం పార్టీలు, అభ్యర్థులు ముద్రించే కాగితాలు, గోడల మీద అంటించే పోస్టర్లు... వీటన్నింటికీ ఎన్నో వందల టన్నుల కాగితం అవసరం. ఇందుకోసం చెట్లను కొట్టి కాగితాన్ని ఉత్పత్తి చేస్తారు.
సాదాసీదా కాగితాల మీద ముద్రణపోయి ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం పెరిగింది.పోస్టర్లు, బ్యానర్లు, బ్యాడ్జీలు, జండాలు వగైరాలన్నింటికీ ఇప్పుడు ప్లాస్టిక్ ని వాడుతున్నారు. తాజాగా వచ్చాయి ఫ్లెక్సిబోర్డులపై ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా పాలీవినైల్ బోర్డులే. ఎన్నికల తర్వాత ఈ బోర్డులు ఎవరికి పట్టవు. వీటిని సొంతం చేసుకునేందుకు పోటీపడి పీక్కుతింటున్నారు కొందరు. ఇళ్లమీద కప్పేందుకు, దడిగా కట్టుకునేందుకు వాడుతున్న ఈ ప్లెక్సిషీట్లు పర్యావరణానికి చెరుపు చేస్తున్నాయి. ఇవి నేలమీద ఏమేరకు పరుచుకుంటాయో ఆ మేరకు పచ్చదనం పోతుంది. ఇవి కుళ్లవు. అలా నిలిచివుండే పాలీవినైల్ బోర్డులు మొక్కలకు, జంతువులకు కూడా ఇబ్బందిగా తయారవుతాయి.
ప్రచారం కోసం తయారయ్యే క్యాసెట్లు, సి.డి.లు వీడియో క్యాసెట్లు వగైరాలన్నీ చివరికి పనికిరాని వస్తువులుగా అవతల పారేసేవే. ఈ ఎలెక్ర్టానిక్ చెత్త ఎన్నిక ఎన్నికకు పెరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినకొద్దీ ప్రకృతిలో మమేకం కాలేని పదార్ధాల సృష్టి, వినియోగం పెగురుతున్నది. ఇది ఎన్నికలవేళ మరింత తీవ్రంగా కనిపిస్తుంది.
ఎన్నికల ప్రచారం కోసం గుంపులు, గుంపులుగా రాజకీయాలపార్టీల నాయకులు బయలుదేరుతారు. ఈ పాదయాత్రల వెంట లేచే దుమ్మ ఎంతో తీవ్రంగా వుంటున్నది. ఆ దుమ్ముని గ్రామస్తులంతా భరించాల్సింది. ఇక వాహనాల ఊరేగింపుల వల్ల వచ్చే దుమ్ము, ధూళి మరింత తీవ్రంగా వుంటుంది. ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నవి. ప్రతి అభ్యర్థి వందకు తగ్గని వాహనాలు వాడాల్సి వస్తున్నది. ఒక్కొక్క వాహనికి ఉపయోగించే ఇంధనం, ఆ వాహనం వదిలే నల్లని, దట్టమైన పొగవల్ల వాతావరణం దెబ్బితింటున్నది. ఎన్నికల వేళ ఎక్కడెక్కడ పడివున్న డొక్కు వాహనాలను వెలికితీస్తారు. వీటి ఇంజన్లు సరిగా వుండవు. పెట్రోల్, డీజిల్ లను సరిగా వాడుకోలేని ఆ ఇంజన్లు వదిలే పొగ రోడ్ల వెంట వెళ్లే సామాన్య ప్రజల శ్వాసక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ వాహనాలు లేపే దుమ్మును పీల్చలేక ఇబ్బంది పడతారు. ఎన్నికల సమయంలో ఎలర్జీ ఇబ్బంది పెరుగుతుంది. ఆస్త్మా రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. శ్వాసక్రియ ఇబ్బందులు పెరుగుతాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|