|
|
Articles: My Thoughts | శేషేంద్ర వారసులెవరు? - Mr. Sarma Guntur Satyaki
| |
అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన విషయమేమిటంటే, ఎన్టీఆర్ పరమపదించడంతో లక్ష్మీపార్వతి అనుచరబృందం అంతర్థానమైపోగా, సాహిత్యంలో మా నాన్న మరణించిన మరుసటి దినం నుంచే ధనరాజ్ గిర్ అనుచరులు తెరమీదికి వచ్చి, వీరంగం చేస్తున్నారు. భద్రిరాజు కృష్ణమూర్తి, అప్పటి ఆంధ్రప్రభ సంపాదకుడు సదాశివ శర్మ, పడాల జగన్నాధరావు, కామోత్సవ్ ను తిరగరాసిన, పడాల జగన్నాధరావు సిద్ధాంత వ్యాసాన్ని రాసిన చంద్రశేఖర్ రావు (ఈటీవి 2 - తీర్ధయాత్ర) ధన్ రాజ్ గిరి ప్రచారం కోసం ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. మే 30న మా నాన్న మరణిస్తే, జూన్ 4న సదాశివశర్మ మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళి, తాను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినట్లుగా చెప్పుకుని, ఆ రోజు అప్పటికప్పుడే సిబ్బందిని బెదిరించి, నానాగొడవ చేసి డెత్ సర్టిఫికెట్ తీసుకుపోయాడు. కుటుంబం పెద్ద చనిపోయిన విషాదంలో మేమంతా ఉండగా, ఏ సంబంధమూ లేని సదాశివశర్మ డెత్ సర్టిఫికెట్ ను అంత హడావిడిగా, దౌర్జన్యంగా ఎందుకు తీసుకున్నట్లు? ఎవరి కోసం తీసుకున్నట్లు?
లక్ష్మీపార్వతి, ఇందిరా ధన్ రాజ్ గిర్ ల మధ్య కొన్ని సామీప్య సారూప్యతలున్నప్పటికీ, కొన్ని పునాదిగతమైన తేడాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ వివాహబంధం వేసుకునే నాటికి, బాలకృష్ణ తల్లి స్వర్గీయ బసవతారకం పరమపదించి దశాబ్దం గడిచింది. వయస్సు రీత్యా రామారావుకు అండ అవసరమైంది. బసవతారకం పరమపదించారు కనుక, ఆ వివాహానికి సంపూర్ణమైన నైతిక ప్రతిపత్తి, చట్టబద్ధతా ఉన్నాయి. కానీ, ఈ సాహిత్య విషయంలో పైన ప్రస్తావించిన రెండు అంశాలు ఛాయామాత్రంగానైనా లేవు. రామారావుతో పెళ్ళైన నాటి నుంచీ, ఆయన మరణించి పన్నెండేళ్ళు దాటినా ఈనాటి వరకూ నందమూరి వంశ నామాన్ని తన పేరుకు జోడించుకునే ఉన్నారు లక్ష్మీపార్వతి.
30 ఏళ్ళలో ఒకే వ్యక్తికి మూడు పేర్లు :
బహుశా 1968లో నాన్న 'పక్షులు' కవితా సంకలనంలో ఫోటోతో సహా రాజ్ కుమారి ఇందిరాదేవి ధన్ రాజు్ గిర్ గా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి 2006 నవంబర్లో 'కామోత్సవ్' లో తన పేరు ఇదే రూపంలో ప్రింటు చేయించుకుంది. కానీ, 1967కు పూర్వం మగ్దూమ్ మొహియుద్దిన్ ప్రధాన కవితా సంకలనం 'బిసాత్-ఎ-రక్స్ ' లో రెండు కవితల చివర కుమారి ఇందిరా ధనరాజ్ గిర్ గా ఉర్దూ, హిందీల్లో కొన్ని వేల ప్రతుల్లో ముద్రితమైంది. మా నాన్న మరణించింది మే 30న, జూన్ 15న రాష్ట్ర సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సంతాప సభను ఈనాడు, హిందూ దినపత్రికల్లో తన సొంత ప్రకటనల ద్వారా హైజాక్ చేసింది. ఈ రెండు ప్రకటనలలో మూడవ రూపంలో కొత్త పేరు బయటపడ్డది. నాన్న చనిపోయిన పదిహేను రోజులు తిరగ్గానే శ్రీమతి ఇందిరాదేవి శేషేంద్రశర్మగా అవతరించింది. మూడు సందర్భాల్లో ముప్ఫై ఏళ్ళు పై చిలుకు కాలంలో ఒకే వ్యక్తి పేరు మూడు రూపాలు ఎందుకు ధరించినట్లు? ఇందిరా ధన్ రాజ్ గిర్ వివరిస్తారా? లేక ఐదవ రోజునే డెత్ సర్టిఫికెట్ ఎత్తుకెళ్ళిన సదాశివశర్మ చెప్పగలరా? లేక భద్రిరాజు కృష్ణమూర్తి చెబుతారా?
అసలు ప్రేమ గానీ, వివాహబంధం పట్ల, వివాహ వ్యవస్థ పట్ల, ఆవగింజంత విశ్వాసం గానీ, గౌరవంగానీ ఉండి ఉన్నట్లయితే, 'హళేబీడు సర్కస్' జరిగిన మరుక్షణమే తన పేరును గుంటూరు ఇందిరగా మార్చుకొని ఉండేది. కానీ, తన గురి, తన లక్ష్యం సర్వకాల సర్వావస్థలలోనూ తన కళ్ళ ముందు ఉంచుకొని, జీవించే ఈ మూడు పేర్ల వ్యక్తి అలాంటి తొందరపాటుకు, పొరపాటుకూ పాల్పడలేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|