|
|
Articles: My Thoughts | వైఎస్ నీటి రాజకీయం - Site Administrator
| |
స్వాతంత్రం సిద్ధించి 62 ఏళ్ళు దాటుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 53 ఏళ్ళు అయింది. ఇంత కాలం గడిచినా రాష్ట్రంలోని గ్రామాలకు తగిన మంచినీటి సౌకర్యాలు లేవు. రక్షిత మంచినీటి సరఫరా అనేది కొద్ది పట్టణాలకే పరిమితం. మంచినీటి సరఫరా కింద ఎన్ని పథకాలు ప్రారంభించారో, ఎన్నివేల కోట్లు ఖర్చుపెట్టారో, ఆ ఖర్చులో రాజకీయ నాయకులు ఎంత వాటా సొంతం చేసుకున్నారో `నీటి'కే తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మంచినీరు సక్రమంగా ఇవ్వలేకపోయిన ప్రభుత్వాలకు ప్రతినిధి అయిన వైఎస్ నేడు ఏకంగా మినరల్ వాటర్ నే అందిస్తాడట!
మినరల్ వాటర్ సరఫరా ఆలోచన వైఎస్ కి స్వయంగా తట్టిందో లేక ఏ అధికారి అందించాడో తెలియదు గాని, ఆ పథకం మీద సరైన అధ్యయనం మాత్రం జరగలేదు. ఒక గ్రామానికి అవసరమైన మినరల్ వాటర్ నీటిని కాకుల లెక్కలలాగా వేసి, అంత మినరల్ వాటర్ తయారీకి అవసరమైన మెషినరీ, దానిమీద పెట్టే పెట్టుబడి వరకు లెక్కలు గట్టి ఒక గొప్ప పథకంగా ప్రకటించాడు వైఎస్. వీలైతే దానికి రాజీవ్ గాంధీ పేరును బెట్టి, సోనియా చేత ప్రారంభం చేయించి రాజకీయ లబ్ధిని భారీగా పొందవచ్చు. కాని వాస్తవంలో ఈ పథకం వల్ల నష్టపోయేది ఆయా గ్రామాలవారే.
ఒక గ్రామాన్నే ఉదాహరణగా తీసుకుంటే... ఆ గ్రామంలో ఉన్న రెండు వందల కుటుంబాలకు రోజుకు పదిలీటర్ల తాగునీరు అవసరం అని అంచనా వేస్తే రోజుకు 2000 లీటర్ల మినరల్ వాటర్ ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మినరల్ వాటర్ తయారీకి అవసరమైన నీటిని భూమినుండే గ్రహించాలి. భూమిలోపల పొరలనుండి ఒకేసారి రెండువేల లీటర్లును తీయాల్సి ఉంటుంది. ఒకేసారి అన్ని లీటర్ల నీటిని తీయటం సరికాదు. మినరల్ వాటర్ తయారీ ప్రోసెస్ లో ఒక లీటర్ స్వచ్ఛమైన నీరు తీయాలంటే నాలుగైదు లీటర్ల నీరు వడగట్టి వదిలేయాల్సి ఉంటుంది. నీటి నాణ్యత సరిగా లేని చోట ఈ వృధానీరు ఇంకా అధికంగా ఉంటుంది అంటే గ్రామానికి అవసరమైన 2000 లీటర్ల మినరల్ వాటర్ కోసం ప్రతిరోజూ పదివేల లీటర్ల భూగర్భ జలాలను బయటకు తోడతారు. ఈ విధంగా ఒక సంవత్సరకాలంలో ఎంతనీరు భూగర్భంలో తగ్గుతుందో అంచనా వేశారా?
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|