TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
కట్టు జారిన మీడియా?
- Site Administrator
< < Previous   Page: 2 of 2    
రాత్రికి రాత్రే ఆర్థికంగా ఎదిగిపోవాలన్న బలీయమైన కోరిక వల్ల ఈ చేతివాటం బలహీనతకు ప్రధాన కారణం. కొంతమంది ఉన్నతాథికారులు రిటైర్మెంట్ తరువాత కూడా పదవిలో కొనసాగేందుకు, రాజకీయ ఆరంగ్రేటం చేసేందుకు వీలుగా నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. అధికారం అనుభవించాలన్న కోరిక, రాజకీయ గాడ్ ఫాదర్ ల ఆశీస్సుల కోసం వృత్తి ధర్మాలను కొందరు అధికారులు పణంగా పెడుతున్నారు. ఇక రెండో విషయం ఏమిటంటే మీడియా తమ ఛానల్ రేటింగ్ పెంచుకునే ప్రయత్నంలో ఆర్మీ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది. అయితే ఛానళ్లు చేసే మేలు కూడా లేకపోలేదు. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జరిగే అవకతవకలను ఎత్తి చూపుతూ మీడియా ప్రచురించే కథనాలు మేలు చేసేవే. హర్యానాలో ఒక బాలికపై డైరక్టర్ ఆఫ్ పోలీసు అత్యాచారం చేయడం, బాధితురాలు గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇదంతా జరిగిన 19 ఏళ్ల తరువాత నిందితుడికి శిక్ష పడటం వంటి ఘటన దేశానికి అవమానం కలిగించే్దే. ఇది ప్రభుత్వ పాలనా వ్వవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతూ మాయని మచ్చను మిగులుస్తాయి. ఈ సంఘటన పాలక ప్రభుత్వాలు, అధికార, పోలీసు యంత్రాంగాల్లో నెలకొన్న డొల్లతనాన్ని బయటపెడుతోంది. బాధితురాలు గోడు వినకుండా, రడీమేడ్ గా రూపోందించిన అబద్దంతో నిజాన్ని కప్పి బొంకును మాత్రమే అనుమతించారు. ఆ బాలిక పాఠశాల యాజమాన్యం కూడా ఇదే తీరును అనుసరించడం మాత్రం బాథ కలిగించేదే. దేశానికి ప్రాతినిధ్యం వహించిన నేతలు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, రిటైర్ అయిన అధికారుల్లో ఎవరైనా ఆ బాలికకు జరిగిన అన్యాయానికి ఆత్మగౌరవం స్థానే అవమానభారంతో కుంగిపోవాల్సిందే. ఆ బాలిక చదివిన పాఠశాల కూడా తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఈ బాలిక కేసు వ్యవహారంలో మీడియా పోషించిన పాత్రను అభినందించాలి. బాలికకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా పోరాటం సాగించింది. అయితే మీడియా ఇదే పాత్రను కొనసాగిస్తుందా, లేక ఈ 19 ఏళ్లు జరిగిన నిర్లక్ష్యాన్నే కొనసాగిస్తుందా అన్నది సంశయించాల్సివస్తోంది. దేశ అంతర్గత భద్రతను కూడా సమీక్షించాల్సివ ఆవశ్యకత ఉంది. దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతున్నాయి. ఉగ్రవాదం పెను సవాల్ విసురుతోంది. ఎప్పటిప్పుడు భద్రతను పటిష్టం చేయడం, ఉగ్రవాదులు చొరబడుతుండటం పరిపాటిగా మారింది. అయితే భద్రతపై హోం మంత్రి చేసే ప్రకటనల్లో ఎప్పుడూ కొత్త విషయం ఉండటం లేదు. కార్గిల్ యుద్ధం జరిగిన తరువాత దేశ అంతర్గత భద్రతలో ఉన్న డొల్లతనం బయటపడింది. అప్పట్లో అంతర్గత భద్రతపై నియమించిన క్యాబినెట్ కమిటీ బోర్డర్ మేనేజ్ మెంట్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పలు కీలక సిఫార్సులు చేసింది. అప్పుడే వాటిని అమలు చేసి ఉంటే ఇపుడు 26/11 సంభవించేది కాదని వివిధ సందర్బాల్లో పలువురు నిపుణులు తమ సైతం సుస్పష్టం చేసింది. అయితే భద్రతపై సెమినార్ లెక్చర్ లు మారుతున్నాయి తప్పితే భద్రతా విధానాలు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా జాతీయ భద్రత కౌన్సిల్ స్పందించి గతంలో వివిథ కమిటీలు దేశ అంతర్గత భద్రతపై చేసిన సిపార్సులను అమలు చేసేందుకు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో మీడియా కూడా క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. భద్రతపై ప్రభుత్వాలకు, ప్రజలకు మథ్య వారధిగా వ్యవహరించాల్సిన బాధ్యతను చేపట్టాలి. ఇక క్రిస్మస్ పర్వదినంనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో వెలుగు చూసిన ఘటనకు యావత్తూ రాజ్యాంగ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఒకవైపు రాష్ట్రం మొత్తం ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాజకీయ, రాజ్యాంగ సంక్షోభం ఎదుర్కొంటున్న సందర్శంలో రాజ్ భవన్ రాసలీలలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఎదుర్కొనాల్సి వచ్చింది. గవర్నర్ వెంటనే తన పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. గవర్నర్ లపై ఆరోపణలు కొత్త కానప్పటికీ రాజ్యాంగ వ్యవస్థకు మాత్రం కళంకం తెచ్చేదే. రాష్ట్ర అత్యున్నత రాజ్యాంగ భవనానికి జరిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేనిది. కొత్త సంవత్సరంలో భారత ప్రజాస్వామ్యానికి ఈ ఘటనలు పునరావృతం కారాదని ఆశిద్దాం.

Read 1 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 2 of 2    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.