|
|
Articles: My Thoughts | ఎన్నికల వేళ కాలుష్యం - Dr. Srinivasa Rao Duggaraju
| |
మరీ ముఖ్యులైన నాయకులు వాహనాలను, హెలికాప్టర్లను వాడతారు. అటువంటి విమానాలు, హెలికాప్టర్లు వదిలే పొగలు ఆకాశంలో పర్యావరణానికి ఇబ్బంది కలిగించేవే. ఒక వి.ఐ.పి ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయనకు భద్రత కలిగించే వాహనాలు, ఆయన మందిమాగధులవి కలిసి వందకు తక్కువ కాకుండా వాహనాలు వస్తాయి. అన్ని వాహనాలు ఒకచోట చేరితే కాలుష్యం కలగక ఏమవుతుంది. మీటింగ్ జరిగే చోటికి వాటర్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలను వేల సంఖ్యలో చేరుస్తున్నాయి. ఒక భారీ బహిరంగ సభ ముగిసిన తర్వాత అక్కడ పేరుకున్న ప్లాస్టిక్ కుప్పలను గమనిస్తే అర్థమవుతుంది. ఎన్నికల కాలుష్య తీవ్రత ఎలా వుందనేది.
ప్రచార వేదికల నిర్మాణానికి పచ్చని చెట్లు కొట్టివేస్తారు. పచ్చికబయళ్లు చదును చేస్తారు. చెరువులను ఆక్రమిస్తున్నారు. నాయకుడి స్థాయిని బట్టి మీటింగ్ జరిగేచోట పర్యావరణ విధ్వంసం వుంటుంది.
ఎన్నికల వేళ అన్నింటికన్నా ఘోరమైన కాలుష్యం ధ్వని కాలుష్యం. ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఆఫీసులు అనే వివక్షత లేకుండా ప్రతిచోట భారీస్థాయిలో మైక్ లు ఏర్పాటు చేస్తారు. నాయకుల ప్రసంగాల రికార్డులను ఉదయం నుండి సాయంత్రం వరకు భారీస్థాయిలో వినిపిస్తుంటారు. పనికిమాలిన ఆ ప్రసంగాలకు సామాన్య ప్రజల చెవులు చిల్లులుపడి పోతాయి. ఆసుపత్రులలోని రోగులు ఈ ధ్వనులకు మరింత అసౌకర్యానికి గరవుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ధ్వని కాలుష్మం మరింత ఇబ్బంది తెస్తుంది.
ఇలా ఎన్నికల ప్రకటనకు మూడు నెలల ముందునుండే ఆరంభమయ్య పర్యావరణ విధ్వంసం ఎన్నికల ఫలితాలు విడుదలవగానే విజేతలు చల్లుకునే రంగుల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలోని ప్రతి అంశం పర్యావరణ విఘాతమే అయినా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవడం లేదు. రాజకీయ కాలుష్యం ఎన్నికల వేళ అదుపులేకుండా కొనసాగిస్తున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|