|
|
Articles: My Thoughts | శేషేంద్ర వారసులెవరు? - Mr. Sarma Guntur Satyaki
| |
బ్రతుకంతా చట్టవిరుద్ధం, అనైతికం :
ఇందిరా ధన్ రాజ్ గిర్ వివాహం 1945లో అప్పటి నిజాం కొలువులో ప్రధానమంత్రి అయిన మహారాజా కిషన్ ప్రసాద్ మేనల్లుడు కిషన్ సేఠ్ తో జరిగింది. పెళ్ళైన రోజే ఆయన్ని కొట్టి పారిపోయి వచ్చింది. దాంపత్య జీవితానికి భౌతికంగా అసమర్ధుడని బంధుమిత్రువర్గాల్లో భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఆయన మీద వేసిన విడాకుల కేసును 1969-70 దాగా సాగదీసింది. ఆపాటికే రీ కిషన్ సేఠ్ జీవితంలో సింహభాగం పూర్తైపోయి నిశ్చేష్టుడైపోయాడు.
ఆయన తల్లిదండ్రులు రాజా ధన్ రాజ్ గిరికి తరచూ మొరపెట్టుకునేవారు, విడాకుల కేసు ఉపసంహరించుకోమని. వైవాహిక జీవితం గడపాలని కోరేవారు. కాకపోతే, విడాకుల కేసునొక కొలిక్కి తీసుకురమ్మని కోరేవారు. కానీ వీరు రెంటికీ ఒప్పుకోలేదు. పర్యవసానంగా ఇందిరా ధన్ రాజ్ తో విసిగి బేజారైన తండ్రి రాజా ధన్ రాజ్ గిర్ వివాహితయై ఉంటేనే తన ఆస్తిలో వాటా వస్తుందని తన వీలునామాలో కరాఖండిగా రాసిపోయాడు. ఈ కారణంగానే వివాహబంధం పట్లగానీ, వివాహవ్యవస్థ మీదగానీ, ఆవగింజంతైనా గౌరవ విశ్వాసాలు లేని మూడుపేర్ల వ్యక్తి సాహిత్యం ముసుగులో, ప్రేమకవిత్వం ముసుగులో వివాహ వ్యవస్థకు లిఖితచరిత్రలో ఈనాటి వరకు ఎరుగని, తీరనిమచ్చను చేసింది. మా నాన్న మరణించిన తరువాత ధనబలంతో మరింత తీవ్రంగా ప్రచారం చేసుకుంటోంది.
'కామోత్సవ్' ఇందిరా ధన్ రాజ్ అంతరాత్మ కథ :
కామోత్సవ్ తో నాన్న సాహిత్య జీవితం పరిసమాప్తమై పోయింది. ఆ తరువాత చేసిన రచనలు పెద్దగా ఏమీలేవు. అప్పట్లోనే నా అభిప్రాయం అడిగితే నవల లక్షణాలు గానీ, ప్రమాణాలు గానీ లేవనీ, ఒక నవలకుండే ఇతివృత్తం, పాత్రలూ, సన్నివేశాలూ, చివరగా ఇచ్చే సందేశం లాంటివేవీ లేవని, చెత్త అనీ చెప్పాను. అప్పట్లో కోర్టు కేసు నడిచింది. పత్రికల్లో గాలిదుమారం రేగింది. కాలానుగుణంగా సద్దుమణిగిపోయింది. అలాంటి రచనను దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత ఇంకొకరి చేత (చంద్రశేఖరరావు - ఈటీవి 2 - తీర్థయాత్ర) తిరగరాయించి, తనకు కాపీరైట్ పెట్టుకొని, అచ్చువేయించింది. తెలుగు సాహిత్యం చరిత్రలోనే ఇంత హేయమైన సంఘటన బహుశ: ఇంతరవకు జరగలేదు. గాలిదుమారం సృష్టించి, నలుగురిలో అపకీర్తి తెచ్చిన తుచ్ఛరచనను తిరగరాయించి తన పేరున ముద్రించుకొని, ప్రచారం చేసుకోవడం వెనుక లక్ష్యమేమిటి? అసలు ఉద్దేశ్యమేమిటి? కనుకనే 'కామోత్సవ్' ఇ.ధ.అంతరాత్మ కథ!
గ్రంథస్వామ్య హక్కులు :
1989లో నా పుట్టినరోజు జన్మదిన కానుకగా తన సమస్త రచనల గ్రంథ హక్కులను (కాపీరైట్స్) తన స్వదస్తూరీతో నాకు రాసిచ్చారు నాన్న. ఆ తరువాత కూడా ఒక చట్టబద్ధమైన అఫిడవిట్ లో కూడా మళ్ళీ నాకు గ్రంథసామ్యం బహూకరించారు. పైన ప్రస్తావించిన అంతరాత్మ కథ నాన్న రచన కాదు, కనుక, ఆకతాయి శక్తుల ఆగడం కనుక, నేను చర్య తీసుకోవడానికి ఇంకా ఉద్యుక్తుడను కాలేదు. కానీ, ఇ.ధ.గానీ, ఆమె అనుచర మూకలు సదాశివశర్మ, భద్రిరాజు కృష్ణమూర్తి తదితరులు ఎలాంటి నీచ కృత్యాలకు పాల్పడినా తప్పక చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. సాహిత్యం, సామాజికం, ప్రజాసంపద, ఆస్తి వివాదాలకుగానీ, ఆస్తి వాటా కొట్టెయ్యడానికి గానీ ఛద్మవేషంగా దుర్వినియోగానికి గురికాకూడదని నాకృత నిశ్చయం, సభ్య సమాజానికి ఇదే నా ప్రార్థన.
నాన్న వెళ్ళిపోయాడు :
1997లో మొదటిసారి గుండెపోటు రావడంతో మనిషి సగం చనిపోయారు నాన్న. మెడిసిటీలో వరంగల్ కు చెందిన డాక్టర్ సుధాకర్ రెడ్డి 'ఓపెన్ హార్ట్ సర్జరీ' చేయాలని చెప్పారు. కానీ, అంజియోప్లాస్టీ జరిగింది. అప్పటి నుంచి త్వరత్వరగా క్షీణించిపోయారు. దాదాపు పదేళ్ళపాటు చెప్పనలవిగాని శారీరక, మానసిక యాతనకు గురయ్యారు. అవసాన దశలో తన కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. సమాజంలో సాహితీ జగత్తులో ఏకాకి అయ్యారు. అసూయాద్వేషాలకు, వైషమ్యాలకు గురయ్యారు. తన తమ్ముడు చనిపోయినప్పుడు, చెల్లెలు మరణించినప్పుడు తన ఊరికి వెళ్ళలేదు. చివరి దశ చూస్తూ వచ్చిన నాకే తీరని మానసిక క్షోభను కలిగించింది. బహుశ: ఏప్రిల్ మొదటివారం నుంచి ఒళ్ళంతా నీరొచ్చి, పనసపండులా ఉబ్బిపోయి ఉన్నారు. హాస్పిటల్ లో చేరమనీ, చేర్చమనీ పలుసార్లు చెప్పాను. కానీ, వినలేదు. మే 30 రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేసింది. 'కమ్ సూన్ / సీరియస్/' అన్నది. 11.15 కల్లా నేను చేరుకొన్నాను. 'గో ఇన్ సైడ్! హి ఈజ్ నో మోర్!' అన్నది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|