|
|
Articles: Devotion | గురుపూర్ణిమ-సందేశం - Site Administrator
| |
మన మనస్సులో ఒక్కొక్కప్పుడు తుఫాను చెలరేగుతుంది. మరొక్కప్పుడు సందేహం పుట్టుకొస్తుంది. ఒకప్పుడు ఒక సమస్య తలెత్తితే మరొక్కప్పుడు మరొకటి... ఎప్పుడైతే మనససు ఉద్విగ్నంగా ఉంటుందో సాధన భజనల నుండి పతనమవుతుందో లేదా దుస్సాంగత్యం కారణంగా సాధనాభజనలు దూరమయ్యాయో అటువంటి వారు ఈ వ్యాసపూర్ణిమ మహోత్సవం నాడు సాధకులుగా కొత్త సంకల్పాన్ని చేసుకోవడం ద్వారా మళ్ళీ ముందుకు పయనించగులుతారు.
ఈ వ్యాసపూర్ణిమ తరువాత ఆత్మారాములగు సంతులు, సంచారం చేసే సంతులు కూడా ఒక్క ప్రదేశం లోనే ఉంటూ కొత్త గ్రంథాలను ప్రారంభిస్తారు. `బ్రహ్మసూత్రాలు' మొదలగు గ్రంథాలను చదవడం, చదివించడం, మననం చెయ్యడం జరుగుతుంది. మానవుడు ఎప్పుడైనా పతనమైనప్పుడు అతడిలో రాక్షసస్వభావం, ద్వైత సంస్కారం, జాతి వాదం, `నీది నాది' అనే చెడుసంస్కారం బాగా విస్తరిస్తుంది. ఎప్పుడైతే మానవుడు అద్వైత జ్ఞానానికి దూరమైపోతాడో అప్పుడు ద్వైతభావం యొక్క దుర్గంధంతో సమాజంలో అశాంతి మొదలవుతుంది. అప్పుడు దాని పరిణామంగా ఏమవుతుందంటే బాహ్య జగడాలు, అశాంతి, సంకుచితత్వం అనేవి పెరిగిపోవడం మొదలవుతాయి. కానీ ఎప్పుడైతే ఆత్మానుభవాన్ని పొందిన ఆచార్యుల యొక్క జ్ఞానం సమాజంలో విస్తరిస్తుందో అప్పుడు ఐకమత్యం, శాంతి, ప్రేమ, ఉదారత, క్షమ, సరళత్వం, శుచి అనే సుగుణాలు చిత్తంలో ఏర్పడి చైతన్యం యొక్క ప్రసాదగుణంతో సాధకుడిని నింపివేస్తాయి.
మానవుడు పైకి ఎదుగుతాడు లేదా క్రిందికి దిగజారుతాడు. పైకి ఎదగడం అనేది చాలా మంచిది. కానీ ఎంతో కొంత పైకెదిగిన సాధకుడు దిగజారకూడదు. కాబట్టి సాధకుని జీవితంలో ఏదైనా ఒక సాత్వికమగు నియమం ఉన్నట్లయితే పతనసమయంలో అతడిని అది రక్షించగలుగుతుంది. మీరు మీ జీవితంలో చిన్నదో, పెద్దతో ఏదో ఒక నియమాన్ని స్వీకరించండి. కాగితంపైన ఆ నియమాన్ని రాసుకోండి. మనస్సుకు గుర్తుచెయ్యడానికి వీలైతే గురు పౌర్ణమినాడు ఆశ్రమానికి వెళ్ళి ఆ నియమాన్ని రాసుకొన్న కాగితాన్ని బడ్ బాద్ షాకో, వ్యాసపీఠానికో తాకించి మీ వద్ద ఉంచుకోండి. దీనిని మీరు మీ పూజ చేసుకొనే ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. అందులో క్రిందివాటిలో ఏదైనా ఒక నియమాన్ని మీరు ఏర్పరుచుకోవచ్చు.`నేను ప్రతిరోజూ ఇన్ని మాలలు జపం చేస్తాను, ఇన్ని ప్రాణాయామాలు చేస్తాను, వారంలో కనీసం ఇన్ని గంటలు మౌనంగా ఉంటాను. నా సామర్థ్యాన్ని బట్టి నెలలో ఒకరోజో, రెండురోజులో లేదా ఐదురోజులో భగవంతుని కోసం కేటాయిస్తాను. సంవత్సరంలో ఇన్ని రోజులు ఆజ్ఞాతవాసం కోసం, ఏకాంతం కోసం కేటాయిస్తాను లేదా ధర్మప్రచారానికి సంవత్సరంలో ఇన్ని రోజులు కేటాయిస్తాను. ఆచార్యుడిని, గురువును సంతుష్ట పరచడానికి వారియొక్క దైవిక కార్యాలలో ఇంత సమయాన్ని, శక్తిని సద్వినియోగం చేసి నేను సత్ పదాన్నిపొందుతాను...'
ఒకవేళ ఈ ప్రకారంగా ఏదైనా నియమాన్ని వ్యాసపూర్ణిమ రోజున ఎవరైనా సాధకుడు స్వీకరించినట్లయితే, బ్రహ్మవేత్తా స్వరూపుడగు వ్యాసభగవానుని తన హృదయ సింహాసనంపై త్వరగా దర్శించుకోవాలని కోరుకొంటున్నట్లయితే దేవతల యొక్క సంకల్పం, గురువుల యొక్క కృప, సాధకుల యొక్క ప్రయత్నం అన్నీ కలిసి అతడి కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|