|
|
Articles: My Thoughts | వైఎస్ నీటి రాజకీయం - Site Administrator
| |
ఆ మేరకు భూగర్భజలాలు మనకున్నాయా? ప్రభుత్వం పథకాలలో సఫలమైనవి తక్కువ. విఫలమైనవే ఎక్కువ. ఈ మినరల్ వాటర్ పథకం విఫల పధకాల జాబితాలోకి చేరితీరుతుంది. క్రమంగా మినరల్ వాటర్ ప్లాంట్ లన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళతాయి. ప్రైవేట్ వ్యక్తులది నీటిమీద పెత్తనం అవుతుంది. ఒక గ్రామానికి ఉన్న పరిమిత జలవనరు మీద వ్యక్తి ఆధిపత్యం పెరుగుతుంది. నీరంతా అతని సొంతం. నీటి వ్యాపారలాభం అతనికి, అతిని లాభంలో వాటా ఎన్నికల సమయంలో అధికారపార్టీకి.
భూగర్భ జలాల మీద హక్కులు మనిషికి మాత్రమేనా? భూగర్భ జలాలను అదుపులేకుండా వాడటం మొదలుపెడితే వాటిమీద ఆధారపడి జీవించే ఇతర జీవుల పరిస్థితి ఏమిటి? అనేకవేల జాతుల మొక్కలు, జంతువులు భూగర్భ జలాలమీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆ జీవులవాటాను మనం లాగేసుకోవడం మంచిదా?
రక్షితనీరు ప్రజలకు అందించడం ఆరోగ్యం దృష్ట్యా అవసరమే అయినా, దానిని మినరల్ వాటర్ గా ఖరీదు కట్టి అమ్మటం అభ్యంతరకరమే. ఉచితంగా అందించాల్సిన నీటిని ప్రభుత్వమే పని కట్టుకుని అమ్ముతానంటుంది. పైగా ఇటువంటి సరఫరాలు నీటి వినియోగంలో మార్పులు తెస్తాయి.
బావిలోనుండి నీరు తోడుకుని ఉపయోగించే రోజుల్లో నీటిని పరిమితంగా వాడుకునేవారు. వృధాచేస్తే తిరిగి బావిలోనుండి తోడేందుకు శ్రమపడాల్సి వస్తుంది. అందుకని నీటి పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవారు. కాని పంపులో నీళ్ళ సరఫరా చేయడం మొదలుపెట్టిన తర్వాత నీటిని వృధాచేయడం పెరిగింది. మునిసిపాలిటీలలో తలకాయ లేని పంపులనుండి గ్యాలన్లనీరు వృధాగాపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా స్విచ్ వేస్తే అలా నీరు బోరులోనుండి పైకి వస్తుందనే భావనలోకి వెళ్ళారు. ఆ నీటికున్న విలువ మరిచిపోయారు. ఇప్పుడు మినరల్ వాటర్ సరఫరా వల్ల జరిగేది ఇదే. చౌకగా వచ్చే నీటిని పలురకాలుగా వాడుకుంటారు. మంచినీటిగానే కాక మరెన్నో రకాలుగా నీటిని వాడుకోవడం మొదలవుతుంది. ఇదంతా నీటిని వృధా చేయడం తప్పించి మరొకటి కాదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|