|
|
Articles: My Thoughts | గిడుగు బాట పట్టామా? - Site Administrator
| |
మరో సంగతినిక్కడ మనం మాట్లాడుకోవాలి. తెలుగు గురించి అంత కృషిచేసిన గిడుగు సవరభాష వంటి ఒక చిన్నభాష గురించి ఎంతో శ్రమించాడు. ఆయనలో సామాన్య ప్రజల భాషపట్ల ఉన్న అనురాగంతోపాటు, భాషలమూలాల్లోకి వెళ్ళి అన్వేషించిన గొప్పతనాన్ని మనం అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం 18 కోట్ల మంది తెలుగు ప్రజల్లో ఉన్న కొన్ని వేల మాండలికాల్ని, మౌలిక పదాల్ని క్రోడీకరించుకోవాలి. గిరిజన భాషల్లోకి వెళ్ళి, ప్రాకృత భాషల్లోకి వెళ్ళి తెలుగు పదాల్ని వెతికి పట్టుకోవాలి. గిడుగు తన మిగిలిపోయిన కోరికగా చెప్పిన సమగ్ర నిఘంటవును తయారుచేయడానికి ఇదంతా కావాలి. వీలైనంతగా అచ్చమైన తెలుగు పదాల్ని మనం ప్రచారంలోకి తెచ్చుకోవాలి. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు తెలుగును మనం పటిష్టం చేసుకొని, నేటి అవసరాలకు తగ్గట్టుగా, ఆధునిక భాషగా మనం అభివృద్ధి చేసుకోవాలి. గిడుగు గాఢంగా కోరుకున్న కోరిక ఇది.
గిడుగు రామమూర్తి గారిని తెలుగుజాతి తమ గుండెల్లో పదిలంగా దాచుకొని, ఆయన చూపినదారిలో నడవాలి. తెలుగుభాషోద్యమ కార్యకర్తలూ, ఆసక్తి ఉన్నవారూ ఎందరో ఉన్నారు. వీరంతా గిడుగు గురించీ, కందుకూరి గురించీ, శ్రీపాద గురించీ, తాపీ ధర్మారావు గురించీ అధ్యయనం చేయాలి. వారు ఏ మౌలికాంశాల మీద వెలుగును ప్రసరించారో, జాతిని హెచ్చరించారో తెలుసుకోవాలి. వాటి ప్రాతిపదికన, నేటి సవాళ్లకు పరిష్కారాల కోసం స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో వెతకాలి. అప్పుడే నడుస్తున్న తెలుగు భాషోద్యమాన్ని ప్రజోద్యమంగా, తెలుగుజాతి ఉద్యమంగా తీర్చిదిద్దడం, అందుకు కావలసిన తాత్విక భూమికను, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం సాధ్యమవుతుంది. అదే ఆ మహానుభావుడు 'గిడుగు'కు తెలుగుజాతి నిజమైన శ్రద్ధాంజలి కాగలదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|