|
|
Articles: TP Features | మహా సరస్సు మాయం - Editor
| |
అక్కడ నుండి విజయవాడ వస్తే కృష్ణానదికి ఆవలిగట్టున పానకాల నరసింహస్వామి దేవాలయం గట్టు కింద మరో అగ్నిపర్వతం ఉన్నది. ఆ స్వామి నోట్లో బెల్లం పానకం పోయటం వల్ల వేడికి బెల్లం చిట్లెం గట్టి రాయిగా మారి అగ్నిపర్వతం అగ్నిపైకి చిమ్మకుండా ఉంటుందని మన వారి నమ్మకం. అక్కడి నుండి తిన్నగా ఒంగోలు వెళితే ఊరవతల గట్టు కింద ఆరిపోయిన మరో అగ్నిపర్వతం ఉన్నది. పూర్వం గోదావరి సరస్సుగా మారిన చోటు నుండి ఒంగోలు వరకు ఒకే వరుసలో అగ్ని పర్వతాలున్నాయని తెలుస్తుంది. అగ్నిపర్వతం వల్ల కలిగిన భూకంపంతో సరస్సు మాయమైందనటానికి ఆరిపోయిన అగ్నిపర్వతాలు నిదర్శనమే గదా!
2. లక్షల సంవత్సరాలుగా ఆ సరస్సును గోదావరి ఇసుకతో నింపటం వల్ల కింది పొరల ఇసుక గట్టిపడి రాతిపొరగా మారింది. సరస్సుకు సరిహద్దులుగా నేను చూపిన పర్వతాల ఇద్దరిన అంటే సరస్సు ఉన్న వైపున ఇసుక, ఇసుకరాయి ఉంటే, ఆ పర్వతాల ఆవలి వైపున ఇటువంటి ఇసుక గాని, ఇసుకరాయి గాని కనబడదు. సరస్సు ఆవరించిన పల్లంలో దొరికే ఇసుకరాయి ఖమ్మం జిల్లాలో, ఇక్కడ గాక మరొక చోట మచ్చుకైనా దొరకదు. అలాగే ఇక్కడా ఇసుక కూడా కన్పించదు. అశ్వారావుపేట నుండి ఇల్లందు వరకు కల్లూరు కనకగిరి కొండల నుండి భద్రాద్రి వరకు ఎక్కడ చూసినా ఇసుక, ఎక్కడ తవ్వినా ఇసుకరాయి కన్పిస్తాయి. ఇదీ ఒక నిదర్శనమే గదా! ఒకనాడిది సరస్సు అనడానికి.
3. కనకగిరి కొండల నుండి తెల్లవాగు, సింగభూపాలం కొండల నుండి 'గొదమవాగు', ఇల్లందు కొండల నుండి 'నల్లవాగు', 'తెల్లవాగు', 'ఎఱ్ఱవాగు' కొత్తగూడెం వద్ద కలిసి 'కిన్నెరసాని', గోదావరికి ఉత్తరపు కొండల నుండి తాలిపేరు, శబరి, అశ్వారావుపేట నుండి 'పెద్దవాగు' ఇవన్నీ గోదావరిలో కలుస్తాయి. నలువైపుల నుండి విస్తరించి ఉన్న కొండల వాలు గోదావరి వైపు ఉండటం వల్లనే గదా! అక్కడి నుండి వచ్చే ప్రవాహాలన్నీ గోదావరిలో కలుస్తున్నాయి. అంటే నలువైపులా విస్తరించిన కొండలు ఆ సరస్సుకు సరిహద్దులు అనుకోవచ్చు గదా!
4. ఆదిమానవుల అవశేషాలు గాని పాత, కొత్త రాతియుగాలకు చెందిన మాన సంస్కృతీ చిహ్నాలు గాని, ఈ సరస్సు విస్తరించిన లోయలో కానరావు. కాని ఈ సరస్సుకు దక్షిణ హద్దుగా ఉన్న కనకగిరిగి దాపున అంటే దక్షిణాన కల్లూరున్నది. దాని సమీపంలో 'వెన్నవలి' గట్టు దిగువన రాకాసి గుళ్ళున్నాయి. ఆదిమానవులు తమ తెగలో చనిపోయిన వారి కొరకు భూగృహాన్ని ఏర్పాటు చేసి అందులో శవాలను పూడ్చి, పెద్ద పెద్ద బండలు దానిచుట్టూ వలయాకారంలో అమరుస్తారు. దానినే మనవాళ్ళు తెలియక రాకాసి గుళ్ళన్నారు. అటువంటివే ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో బయటపడ్డాయి.
కాని పాపికొండల నుండి సరస్సు విస్తరించిన ఏ ప్రాంతంలోనూ ఇంత వరకు అటువంటి రాకాసి గుళ్లు కనబడలేదు. అంతేగాదు నలుదిక్కులా కొండల నడుమ ఏర్పడిన సరస్సు అనదగిన ప్రాంతంలో మరెక్కడా మనకు కనిపించని ఇసుక-ఇసుక- ఇసుకే కనిపిస్తుంది. కిందంతా ఇసుక రాతిపొరలే తప్ప, పాత కొత్త రాతి యుగానికి సంబంధించిన ఏ చిహ్నాలూ లేవు. సరస్సు గనుక, ఉండే అవకాశమూ లేదు.
ఉష్ణగుండాల నుండి ఒంగోలు వరకు అగ్నిపర్వతాల వరుస గలదని వీటివల్ల ముఖ్యంగా ఉష్ణగుండాల, సత్తుపల్లి సమీపంలో ఉన్న అగ్నిపర్వతాలు గల్గించిన భూకంపమే పాపికొండల పతనానికి కారణమై అలనాటి మహాసరస్సు కనుమరుగై తన ఉనికిని తెలియచేస్తే పైన ఉసుక, లోపల ఇసుకరాయి పొరలను మాత్రం వదిలి వెళ్ళిందని చెప్పవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|