|
|
Articles: Devotion | గురుపూర్ణిమ-సందేశం - Site Administrator
| |
చిత్తంలో ఒక్కొక్కసారి క్రిందికి జారడం జరుగుతుంది. మరొకసారి పైకి ఎదగడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మంచి సాంగత్యం లభిస్తుంది. మరొక్కసారి చెడుసాంగత్యం లభిస్తుంది. మనుషులకంటే ఇతరములైన ప్రాణులైతే కర్మల యొక్క ఫలాన్ని అనుభవించే క్రమంలో ప్రకృతిచే ప్రేరేపించబడి ఆ దిక్కుగా నెట్టివేయపడతాయి. కానీ భగవంతుడు మానవునికి కొత్త స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మనుష్యుడు ఉన్నతుడు కావచ్చు లేదా అధోగతి పాలు కావచ్చు. ఉన్నతుడైతే మంచిదే, కానీ అధోగతి పాలు కాకుండా, పతనం కాకుండా ఉండడానికి జీవితంలో ఏదైనా నియమాన్ని ఏర్పరచుకోవాలి.
ఎవరైతే సత్య్ శిష్యులై ఉంటారో వారు ఆచార్యుల ఉపాసనలో తన శరీరాలను, మనస్సులను, జీవితాలను కూడా త్యాగం చేసి ఆచార్యతత్త్వంలో నిలద్రొక్కుకొంటారు. శిష్యునిలో శిష్యత్వం ఉన్నట్లయితే ఆ శిష్యుడు గురుతత్వం యొక్క ప్రసాదాన్ని పొందగలుగుతాడు. గురువులో గురుత్వం ఉన్నట్లయితే ఆ గురువు శిష్యులకు గురుతత్త్వం యొక్క ప్రసాదాన్ని రుచిచూపిస్తారు. ఎవరైతే ఆ ప్రసాదాన్ని పొందడానికి అర్హులో వారు సాధకులు, శిష్యులు అనబడతారు. ఆథ్యాత్మిక ప్రసాదాన్ని పంచే సామర్థ్యం ఎవరిలో ఉంటుందో వారు గురువులు అనబడతారు. అటువంటి సద్గురువులు మరియు సత్ శిష్యుల యొక్క ఉత్సవం ఏదైతే ఉంటుందో అదే వ్యాసపూర్ణిమ మహోత్సవం.
ఈ రోజున సాధకుడు పాలు, పండ్లు, లేదా అల్పాహారం మాత్రమే స్వీకరిస్తూ ధ్యానభజనలు, సేవ, స్మరణ, మౌనం మొదలగువాటిని అవలంభనగా చేసుకొని తనలో దాగి ఉన్న ఆంతరిక శక్తులను మేల్కొలిపే దృఢ సంకల్పాన్ని చేస్తాడు. ఎలా ఎలా ఆంతరంగిక ప్రసాదం లభిస్తూ ఉంటుందో అలా అలా అతడు దోషరహితుడుగా మారుతూ ఉంటాడు. ఇది దోషరహితంగా మారే ఉత్సవం. ఆంతరంగిక ప్రసాదాన్ని పొందగలిగే ఉత్సవం. ఇంకా ముందుకు వెళ్ళిన తరువాత గురువుకు, శిష్యునికి, భగవంతునికి, భక్తునికి మధ్యనున్న దూరాన్ని అంతంచేసే ఉత్సవం. జననమరణ చక్రాన్ని విరిచిపారేసే ఉత్సవం. ప్రకృతియొక్క ప్రభావం ఎక్కడైతే ఉండదో ఆ పరమతత్త్వంలో మేల్కొనగలిగే ఉత్సవం.
(పూజ్యబాపూజీ గారి సత్సంగ ప్రవచనం `ఋషి ప్రసాద్' నుండి)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|