|
|
Articles: My Thoughts | వైఎస్ నీటి రాజకీయం - Site Administrator
| |
భుగర్భజలాలు అపరిమితంగా పైకి తీయడం మొదలైతే ఆ ప్రాంతంలోని చెరువులు, కుంటలు ఎండిపోతాయి. నదీజలాలు తగ్గిపోతాయి. చివరిగా నీటికి కటకట ఏర్పడుతుంది. గ్రామాలలో ఉన్న నీటివనరు సక్రమ వినియోగం గురించి ఆలోచించాల్సింది పోయి భూగర్భజలాల మీద దాడి చేయడం అంగీకరించలేం.
ప్రభుత్వ `ప్రయోగాత్మకంగా' అనే పదం ప్రజలనుండి ఒక్కసారిగా వ్యతిరేకత రాకండా చూసుకునేందుకే తప్పించి మంచి చెడులు బేరీజు వేసి చూసుకునేందుకు కాదు. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే అది అమలు చేస్తుంది. తెలంగాణాకి చెందిన ఒక ఎమ్.ఎల్.ఎ ఇప్పటికే 70 మినరల్ వాటర్ ప్లాంట్స్ నడుపుతూ భారీగా నీటి వ్యాపార లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇప్పుడిక అధికార పార్టీ ఎమ్.ఎల్.ఎ లందరూ తమతమ నియోజకవర్గాలలో నీటి వ్యాపారం సొంతదార్లు అవుతారు. ముఖ్యమంత్రి వైఎస్ గారి అసలు ఉద్దేశ్యం కూడా ఇదే. తమ పార్టీ ఎమ్.ఎల్.ఎ నీటి వ్యాపారంతో సాధించే డబ్బు మూటలతో వచ్చే ఎన్నికల పెట్టుబడులు పెడతాడు. అధికారం నిలుపుకునే యత్నంలో జలవనరులు ఇంకిపోతేనేమి! పర్యావరణం విధ్వంసమైతేనేమి?
ప్రకృతి వనరు మీద ఏ ఒక్కరికో ఆధిపత్యం ఇచ్చే ఎటువంటి ప్రయత్నాన్నైనా అడ్డుకోవాల్సిందే.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|