|
|
Articles: My Thoughts | బహునాయకత్వం - Site Administrator
| |
తెలంగాణా సాయుధ పోరాటం తరువాత కౌలుదారీ చట్టం, శ్రీకాకుళం పోరాటం తరువాత 1/70 రెగ్యులేషన్, 1970లలో భూసంస్కరణ చట్టాలు, 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1980లో అటవీ సంరక్షణ చట్టం, 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఇలా ఎన్నో చట్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ చట్టాలు అమలు చేసేందుకు ఉపయోగపడే కోర్సులు ఏవీ రాలేదు. ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్ మెంట్ (ఇర్మా) ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ (ఐఐఎఫ్ ఎమ్) ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎమ్) ఇలా కొత్త కొత్త కోర్సులు వచ్చాయి. సోషల్ వర్క్ కోర్సు ఎలాగూ ఉంది. సామాజిక శాస్త్రాల సంగతి చెప్పఖ్కర్లేదు. ఈ కొత్త కోర్సులు చదివిన యువతరానికి కొత్త కొత్త అవతారపురుషులు దొరికారు. వనరుల పెంపకం అలా ఉంచి, క్షీణిస్తున్న వనరులు అభివృధి చేస్తే జనానికి కూలీ దొరుకుతుంది. ఊరు పచ్చగా ఉంటుంది అని నడుంకట్టిన అన్నాహజారే, భూమి ఎంత ఎక్కువ ఉంటే అంత నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది. ప్రస్తుతం భూమి పంపంకం జోలికి పోలేం, నీటి పంపంకం మాత్రం సమానంగా జరిగేటట్లు చూద్దాం అని పానీ పంచాయత్ ఉద్యమం, అడవిలో గిరిజనుల హక్కులు, కూలీ గొడవ మనకొద్దు, అడవులు పెంచుదాం, ఫలసాయం పంచిపెడదాం అంటూ ఉద్యమించిన అటవీశాఖ అధికారి ఎకె బెనర్జీ వగైరాలు ఆరాధ్యదేవతలైనారు. అటు ప్రపంచబ్యాంకు, ప్రభుత్వాలు, ఫోర్టుఫౌండేషన్, దోరాబ్జీ ట్రస్టు వగైరాలు నిధుల వర్షం కురిపించాయి. కొత్త కోర్సులు చదివిన యువతరం వీటి వెంట పడ్డది. పెద్ద పెద్ద సంస్థలు పుట్టకొచ్చాయి. అందరూ అభివృద్ధి మంత్రం జపించసాగారు.
స్ధూలజాతీయ ఉత్పత్తి, స్ధూలజాతీయ ఆదాయం పెరుగుతుంటే చాలు, సంపాదించినవాడు ఖర్చు పెడతాడుగదా - ఆ ఖర్చు, కొనుగోళ్ళలో కార్మికులకు, కూలీలకు కూడా పని దొరుకుతుంది కదా - ఇది ఈనాటి వాదన. మార్క్స్ ఉత్పత్తి సాధనాలు పనివాడి చేతిలో ఉండాలి అన్నాడు. కాని ఈవేళ 'ఏదో ఉద్యోగం ఇప్పించండి' అని జనం ప్రాధేయపడుతున్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు బూర్జువా చదువులు చెపుతూ విప్లవాల గూర్చి మాటాడుతున్నారు.
ఈ పరిస్థితులు, మానవశాస్త్రవేత్తలలో ఆర్థికశాస్త్రవేత్త రేమాండ్ ఫిర్త్ సంకలనంలోని ఒక వ్యాసాన్ని గుర్తు తెస్తున్నాయి. ఒక పరిశోధకుడు ఒక ఊరువెళ్ళేసరికి, గ్రామమంతా సమావేశమై, ఒక గంభీరమైన సమస్యమీద చర్చిస్తున్నారు. అప్పట్లో ఆ గ్రామంలో కొందరు మోతుబరులు మరనాగళ్ళు కొన్నారు. ఈ నాగళ్ళవల్ల పని ఎక్కువౌతుంది, కూలీ గింజలు పెంచమంటూ కమ్మరులు పట్టుబడుతున్నారు. అష్టాదశ వృత్తులవారి సేవలకు కళ్ళంలో గింజలు పంచడం ఒకనాటి మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ఒరవడి, ఈ పంపంకంలోని అంతర్గత సూత్రాలను ఈ విధంగా ఆ పరిశోధకుడు ఆవిష్కరించాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|